Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-క్రీడా సమాఖ్యలకు ఐఓఏ లేఖ
న్యూఢిల్లీ : 2020 టోక్యో ఒలింపిక్స్ ఏడాది పాటు వాయిదా పడ్డాయి. ఒలింపిక్స్ అర్హత టోర్నీలు సైతం వాయిదా పడ్డాయి. ప్రపంచం ఎదుర్కొంటున్న ఆరోగ్య సంక్షోభం ముగియగానే ఒలింపిక్స్ సన్నద్ధత మొదలు కానుంది. 2021 ఒలింపిక్స్కు ఏ విధంగా సన్నద్దం కానున్నారో మాకు చెప్పండి అంటూ జాతీయ క్రీడా సమాఖ్యలకు భారత ఒలింపిక్ సంఘం అధ్యక్షుడు నరెందర్ బత్రా శనివారం లేఖ రాశారు. 'టోక్యో 2020 ఒలింపిక్స్కు 2021కు వాయిదా పడిన సంగతి తెలుసు. 2021 ఒలింపిక్స్కు ప్రణాళిక చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ ఏడాదిలో ముగియనున్న హై పర్ఫార్మెన్స్ డైరెక్టర్, కోచ్లు, సహాయక సిబ్బంది కాంట్రాక్టులను 2021 వరకు పొడగించండి. ఈ ప్రక్రియ వీలైనంత త్వరగా మొదలవ్వాలి. కరోనా వైరస్తో వాయిదా పడిన అర్హత టోర్నీలు మళ్లీ జరుగుతాయి. తాత్కాలిక ముసాయిదా సిద్ధం చేసుకోండి. ఈ క్రీడల్లో జరగాల్సి ఉన్న అర్హత టోర్నీల వివరాలను మాతో పంచుకోండి. అథ్లెట్లు ఎక్కడ ఉంటున్నారు, ఆరోగ్య పరిస్థితి వివరాలు తెలుసుకుని మాకు అందించండి. ఈ విపత్కర పరిస్థితుల్లో అందరం ఏకతాటిపై ఉండాల్సిన అవసరం ఉంది' అని ఐఓఏ అధ్యక్షుడు నరెందర్ బత్ర క్రీడా సమాఖ్యలకు రాసిన లేఖలో పేర్కొన్నాడు.