Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-వివాద ట్రిబ్యునల్కు వెళ్లనున్న ఐసీసీ
-రూ. 200 కోట్ల పన్ను మినహాయింపు కోసం
న్యూఢిల్లీ : భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)కి ఊరట లభించింది. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) మధ్యేమార్గంగా అంతర్జాతీయ వివాద ట్రిబ్యునల్ (ఇంటర్నేషనల్ డిస్ప్యూట్స్ ప్యానల్)ను ఆశ్రయించేందుకు రంగం సిద్ధం చేసుకుంది. ఈ మేరకు బీసీసీఐ వర్గాలు అనధికారింగా చెబుతున్నాయి. ఐసీసీ శుక్రవారం టెలీ కాన్ఫరెన్స్లో సమావేశమైంది. ఈ సందర్భంగా బీసీసీఐతో సుదీర్ఘంగా కొనసాగుతున్న పన్ను మినహాయింపు వివాదంపై ఐసీసీ ఓ మెట్టు దిగి వచ్చింది. 2016 టీ20 వరల్డ్కప్కు భారత్ ఆతిథ్యం ఇచ్చింది. గతంలో నిర్వహించిన ఐసీసీ ఈవెంట్లకు ప్రభుత్వం పన్ను మినహాయింపు ఇచ్చింది. కానీ 2016 మెగా ఈవెంట్కు భారత ప్రభుత్వం పన్ను మినహాయింపు ఇవ్వలేదు. దీంతో వినోదపు పన్ను ఐసీసీ చెల్లించాల్సి వచ్చింది. పన్ను మినహాయింపు సాధించటం ఆతిథ్య బోర్డు బాధ్యతగా ఐసీసీ పలుమార్లు విస్పష్టంగా తెలిపింది. పన్ను మినహాయింపు సాధించలేనందున, ఆ మొత్తం సొమ్ము బీసీసీఐ భరించాలని ఐసీసీ వాదిస్తోంది. ఈ మేరకు గతంలోనే 23.7 మిలియన్ అమెరికన్ డాలర్లకు ఐసీసీ నోటీసు ఇచ్చింది. ఆ సొమ్ము ఇవ్వకుంటే, ఐసీసీ భారత్కు ఇవ్వాల్సిన ఆదాయపు వాటాలో మినహాయించుకుంటానని హెచ్చరించింది. భారత్లో నిర్వహించాల్సిన 2021 టీ20 వరల్డ్కప్, 2023 వన్డే వరల్డ్కప్ ఆతిథ్య హక్కులు రద్దు చేస్తానని సైతం బెదిరింపులకుప పాల్పడింది. తాజాగా శుక్రవారం నాటి టెలీ కాన్ఫరెన్స్లో సౌరవ్ గంగూలీ ఈ విషయాన్ని లేవనెత్తాడు. గత హెచ్చరికలను మానుకున్న ఐసీసీ, వివాదాన్ని అంతర్జాతీయ వివాద ప్యానల్కు వెళ్లేందుకు నిశ్చయించుకుంది. ఇప్పుడు అంతర్జాతీయ వివాద ప్యానల్ ఐసీసీకి అనుకూలంగా తీర్పు వెలువరిస్తే, రానున్న 2021, 2023 వరల్డ్కప్లకు సైతం భారత ప్రభుత్వం నిరాకరిస్తే.. బీసీసీఐ సొంతంగా పన్ను భరించాల్సి ఉంటుంది