Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-టోక్యో 2020 క్రీడల అధ్యక్షుడు మోరె
టోక్యో : 2020 టోక్యో ఒలింపిక్స్ అధికారికంగా ఏడాది పాటు వాయిదా పడ్డాయి. కరోనా వైరస్ విజృంభిస్తున్నా షెడ్యూల్ ప్రకారం జులై 24 ఆరంభానికి టోక్యో నిర్వహణ కమిటీ ఏర్పాట్లు చేసింది. ఆరోగ్య సంక్షోభ పరిస్థితుల్లో ఒలింపిక్స్ చరిత్రలోనే తొలిసారి వాయిదా నిర్ణయం తీసుకున్నారు. రూ. 9 లక్షల కోట్లతో జపాన్ ఒలింపిక్స్కు రంగం సిద్ధం చేసింది. తాజాగా ఏడాది వాయిదాతో మరో రూ. 3 లక్షల కోట్ల మేరకు వ్యయ భారం పడనుంది. టోక్యో ఒలింపిక్స్ వాయిదాతో అనివార్యమైన భారీ వ్యయ భారాన్ని ఎవరు భరించాలని టోక్యో ఒలింపిక్స్ అధ్యక్షుడు యషిరో మోరె ప్రశ్నించాడు. 2021 వేసవిలో ఒలింపిక్స్ నిర్వహణకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని, అంతర్జాతీయ క్రీడా సమాఖ్యల క్యాలెండర్ను టోక్యో టాస్క్ఫోర్స్ కమిటీతో పంచుకోవాలని మోరె సూచించారు. అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ సహా ఇతర స్పాన్సర్లు, స్పోర్ట్స్ ఫెడరేషన్లతో చర్చలు జరిపి ఆమోదయోగ్యమైన సమయంలో నూతన షెడ్యూల్ను ప్రకటించనున్నారు. 2021లోనూ జులై 24-9 ఆగస్టు షెడ్యూల్కు కాస్త ఇటు ఇటుగానే ఉండనున్నట్టు విశ్వసనీయ సమాచారం. ఒలింపిక్స్ నూతన షెడ్యూల్ ప్రకటిస్తే, క్రీడా సమాఖ్యలు తమ వార్షిక క్యాలెండర్లను సమీక్షించుకుంటాయని టోక్యో నిర్వహణ కమిటీ తెలిపాయి. రానున్న రెండు వారాల్లో టోక్యో 2020 ఒలింపిక్స్ నూతన షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉంది.