Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-టీ20 వరల్డ్కప్, భారత్ సిరీస్పై ప్రభావం
న్యూఢిల్లీ : ఐసీసీ టీ20 వరల్డ్కప్ 2020 అధికారికంగా కష్టాల్లో పడింది!. ఈ ఏడాది అక్టోబర్ 18 నుంచి ఆస్ట్రేలియా వేదికగా మెన్స్ ఐసీసీ టీ20 వరల్డ్కప్ జరగాల్సి ఉంది. కరోనా వైరస్ మహమ్మారి ఆస్ట్రేలియాలో వేగంగా విస్తరిస్తోంది. పాజిటివ్ కేసులు 2000 దాటడం, మరణాలు 16 నమోదు కావటంతో ఆ దేశ ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకుంది. రానున్న ఆరు నెలల పాటు ఆస్ట్రేలియా సరిహద్దులను మూసివేస్తున్నట్టు ప్రకటించింది. విదేశీ రాకపోకలపై పూర్తి నిషేధం విధించింది. ఆస్ట్రేలియా ప్రభుత్వ నిర్ణయంతో ఐసీసీ టీ20 వరల్డ్కప్ నిర్వహణపై నీలినీడలు కమ్ముకున్నాయి. టీ20 వరల్డ్కప్కు ముందే టీమ్ ఇండియా ఆస్ట్రేలియా పర్యటనకు బయల్దేరాల్సి ఉంది. అక్కడ తొలుత టీ20 సిరీస్ ఆడనుండగా.. టీ20 వరల్డ్కప్ తర్వాత బోర్డర్-గవాస్కర్ నాలుగు మ్యాచుల టెస్టు సిరీస్లో తలపడాల్సి ఉంది. కరోనా వైరస్ పంజా విసురుతున్న వేళ ఇప్పుడు భారత్తో సిరీస్ సహా టీ20 వరల్డ్కప్పై అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఆరు నెలలు లోగా పరిస్థితులు సద్దుమణిగితే ఆంక్షలు ఎత్తివేసే అవకాశం ఉన్నప్పటికీ.. అనిశ్చితి వాతావరణంలో స్వల్ప సమయంలో నిర్వహణ ఏర్పాట్లు, సన్నద్ధత కఠిన సవాల్ విసరనున్నాయి.