Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-త్వరలోనే వాయిదా నిర్ణయం
లండన్ : ప్రతిష్టాత్మక వింబుల్డన్ గ్రాండ్స్లామ్ ఓపెన్కు కరోనా వైరస్ దెబ్బ తగిలింది. యూరోప్ సహా ఇంగ్లాండ్లో కోవిడ్-19 వీర వీహారం చేస్తోంది. కరోనా వైరస్ సృష్టించిన మరణమృదంగానికి ఇటలీ, స్పెయిన్లో శవాల గుట్టలు దర్శనమిస్తున్నాయి. ఇటువంటి కఠిన పరిస్థితుల్లో వింబుల్డన్ గ్రాండ్స్లామ్ను సైతం వాయిదా వేయనున్నట్టు సమాచారం. ఈ మేరకు జర్మన్ టెన్నిస్ ఫెడరేషన్ ఉపాధ్యక్షుడు డిర్క్ వెల్లడించారు. ' ఇది పుకార్లు కాదు. వింబుల్డన్ వాయిదా నిర్ణయం బుధవారం వెలువడనుంది' అని డిర్క్ పేర్కొన్నాడు. జూన్ 29-12 జులైన వింబుల్డన్ జరగాల్సి ఉంది. నూతన షెడ్యూల్ సమయంపై భిన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. మే 24న ఆరంభం కావాల్సిన ఫ్రెంచ్ ఓపెన్ను ఇప్పటికే సెప్టెంబర్ 20కు వాయిదా వేశారు. వింబుల్డన్ గడ్డి కోర్టులో ఆడే టోర్నీ. వింబుల్డన్ను సెప్టెంబర్, అక్టోబర్ సమయంలో నిర్వహిస్తే గడ్డిపై విపరీతంగా తేమ నిలుస్తుంది. తేమతో కూడిన పరిస్థితుల్లో వింబుల్డన్ నిర్వహణ కష్టసాధ్యమని నిపుణులు చెబుతున్నారు.