Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-ఆటగాళ్లను కోరనున్న క్రికెట్ ఆస్ట్రేలియా
మెల్బోర్న్ : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఎప్పుడు మొదలైనా, సూపర్ హిట్ లీగ్లో భాగమయ్యేందుకు సిద్ధంగా ఉన్నామని ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డెవిడ్ వార్నర్ వంటి వాళ్లు చెబుతుండగా, అసలు ఈ ఏడాది ఐపీఎల్ కాంట్రాక్టులు వదులకోవాల్సింగా ఆటగాళ్లను కోరేందుకు క్రికెట్ ఆస్ట్రేలియా సిద్ధమవుతోంది. ఈ మేరకు క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) వర్గాలు సూచనప్రాయంగా చెబుతున్నాయి. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ఐపీఎల్ను ఏప్రిల్ 15కు వాయిదా వేశారు. భారత్లో ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఏప్రిల్ 15 తర్వాత ఐపీఎల్ జరిగే అవకాశాలు ఏమాత్రం కనిపించటం లేదు. ఇదే సమయంలో ఆస్ట్రేలియా ఆరు నెలల పాటు దేశ సరిహద్దులను మూసివేసింది. ప్రయాణాలపై ఆంక్షలు విధించింది. దీంతో ఈ ఏడాది ఐపీఎల్ కాంట్రాక్టులను వదులుకోవాల్సిందిగా ఆటగాళ్లకు సీఏ సూచించనుంది. ఆటగాళ్లు ఐపీఎల్ ప్రాంఛైజీలతో నేరుగా ఒప్పందాలు చేసుకున్నారు. దీనితో సీఏకు ఎటువంటి సంబంధం లేదు. ఐపీఎల్లో ఎనిమిది ప్రాంఛైజీలకు 17 మంది ఆస్ట్రేలియా క్రికెటర్లు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఐపీఎల్ సహా ఇంగ్లాండ్లో ఆరంభం కానున్న తొలి ' ది హండ్రెడ్' లీగ్కు సైతం దూరంగా ఉండమని ఆసీస్ బోర్డు ఆదేశాలు జారీ చేసే అవకాశం ఉంది. పాట్ కమిట్స్, స్టీవ్ స్మిత్, డెవిడ్ వార్నర్, గ్లెన్ మాక్స్వెల్లను కాంట్రాక్టులు వదులుకోవాల్సిందిగా క్రికెట్ ఆస్ట్రేలియా కోరనుందని సమాచారం.