Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-క్రికెట్ సీజన్పై కెవిన్ పీటర్సన్
ముంబయి : కరోనా వైరస్ మహమ్మారి నిర్దాక్షిణ్యంగా విజృంభిస్తోంది. ప్రపంచ దేశాలను గుప్పిట పట్టి వణికిస్తోన్న కోవిడ్-19 దెబ్బకు క్రికెట్ పూర్తిగా నిలిచిపోయింది. కోవిడ్-19కు అతి పెద్ద క్రికెట్ లీగ్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) వాయిదా పడింది. అంతర్జాతీయ షెడ్యూల్ నష్టపోయిన ఆటగాళ్లు ఆర్థిక దన్ను కోసం ఐపీఎల్ కావాలని బలంగా కోరుకుంటున్నారు. ' ఐపీఎల్ కచ్చితంగా జరుగుతుందని నిజంగా నమ్ముతున్నాను' అని ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ కెవిన్ పీటర్సన్ స్టార్స్పోర్ట్స్ చానల్ చర్చలో వ్యాఖ్యానించాడు. మార్చి 29న ఆరంభం కావాల్సిన ఐపీఎల్2020, ఏప్రిల్ 15కు వాయిదా పడిన సంగతి తెలిసిందే. ప్రస్తుత పరిస్థితుల్లో ఏప్రిల్ 15 తర్వాత సైతం ఐపీఎల్ నిర్వహణపై కచ్చితమైన సమాచారం ఉండబోదని బీసీసీఐ వర్గాలు చెబుతున్నాయి. 'జులై-ఆగస్టులో ఐపీఎల్ మరీ తొందర అవుతుంది. ఐపీఎల్ జరగాలని నేను నిజంగా బలంగా నమ్ముతున్నాను. క్రికెట్ సీజన్ ఐపీఎల్తోనే ఆరంభం కావాలని కోరుకుంటున్నాను. ప్రపంచ వ్యాప్తంగా ప్రతి ఆటగాడు ఐపీఎల్లో భాగం అయ్యేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రాంఛైజీలు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు, వ్యవస్థలోకి లావాదేవీలు తీసుకెళ్లటం ఈ పరిస్థితుల్లో అవశ్యం. మూడు వేదికల్లోనైనా అభిమానులు లేకుండా ఐపీఎల్ను నిర్వహించవచ్చు. 3-4 వారాల్లో లీగ్ను పూర్తి చేసే అవకాశం ఉంది. మూడు వేదికల్లోనే నిర్వహణ అన్నివిధాల క్షేమం, సురక్షితం. ఈ పరిస్థితుల్లో అభిమానులు నేరుగా ఐపీఎల్ వీక్షించలేరు. కానీ ఇంటిదగ్గర టెలివిజన్లో ముంబయి ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ సమరానికి ఛీర్స్ కొట్టవచ్చు' అని పీటర్సన్ అన్నారు. ఈ పరిస్థితుల్లో అన్ని విభాగాల నుంచి అనుమతులు లభించటం కీలకం, ఐపీఎల్ కచ్చితంగా జరగాలి. ఎందుకంటే ఆర్థిక వ్యవస్థకు అది ఊతం ఇస్తుంది. ఐపీఎల్ కేవలం ముంబయి ఇండియన్స్ ఇండియన్స్, ఎం.ఎస్ ధోని, విరాట్ కోహ్లిలతో ముడిపడినది కాదు. తెరవెనుక ఎంతోమంది దీని కోసం పనిచేస్తున్నారు. వారికోసమైనా ఐపీఎల్ జరగాలని సంజరు మంజ్రేకర్ అభిప్రాయపడ్డారు