Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : కరోనా వైరస్పై పోరుకు మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ రూ 50 లక్షలను పీఎం-కేర్స్కు విరాళం ప్రకటించాడు. ఈ విషయాన్ని తన ట్విటర్ ఖాతా ద్వారా యువరాజ్ ఆదివారం తెలిపాడు. 'మనం ఐక్యంగా ఉంటేనే మనం బలంగా ఉంటాం. సంఘీభావం ప్రకటించడానికి ఇది ఒక గొప్ప అవకాశం. నేను పీఎం కేర్స్ ఫండ్స్కు రూ. 50 లక్షల విరాళం ఇస్తున్నాను. దయచేసి మీరు కూడా మీ వంతు సహాయం చేయండి' అని యువరాజ్ తెలిపాడు.