Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : 2027లో నిర్వహించే ఎఎఫ్సీ ఆసియా కప్ ఆతిథ్య హక్కుల కోసం భారత్ బిడ్ను దాఖలు చేసింది. బిడ్ను దాఖలు చేసినట్టు ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫేడరేషన్ ప్రధాన కార్యదర్శి కుశాల్ దాస్ ఆదివారం మీడియాకు వెల్లడించారు. ఒక వేళ ఈ హక్కులు భారత్కు లభిస్తే ఆసియా ఫుట్బాల్ కప్ను మనదేశంలో తొలిసారిగా నిర్వహించే అవకాశం లభిస్తుంది. 2027 కప్ నిర్వహణ హక్కుల విషయాన్ని ఆసియా ఫుట్బాల్ కాన్ఫేడరేషన్ (ఎఎఫ్సీ) వచ్చే ఏడాదిలో వెల్లడించనుందని భావిస్తున్నారు. కాగా, బిడ్ల దరఖాస్తు గడువును మార్చి 31 నుంచి జూన్ 30 వరకూ ఎఎఫ్సీ పొడిగించింది. కరోనా వైరస్ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. 2027 కప్ హక్కుల కోసం భారత్, సౌదీ ఆరేబియా ప్రధానంగా పోటీ పడుతున్నట్టు సమాచారం. 2023 కప్ హక్కుల కోసం భారత్ పోటీ పడినా చివరి నిమిషంలో తప్పుకుంది. 2023 ఆసియా కప్కు చైనా ఆతిథ్యం ఇవ్వనుంది. కాగా, 2017లో పురుషుల అండర్ -17 కప్ను భారత్ విజయవంతంగా నిర్వహించింది. ఈ ఏడాది నవంబర్లో జరగాల్సిన మహిళల అండర్-17 కప్ వాయిదా పడిన సంగతి తెలిసిందే. అలాగే 2022లో జరిగే ఆసియా మహిళ ఫుట్బాల్ కప్ ఆతిథ్య హక్కులను భారత్ ఇప్పటికే దక్కించుకుంది.