Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీమాతో రూ.1071 కోట్లు
- ఐపీఎల్కు లేని మహమ్మారి బీమా
లండన్ : టెన్నిస్ గ్రాండ్స్లామ్ టోర్నీలలో వింబుల్డన్ది ప్రత్యేక స్థానం. అన్ని గ్రాండ్స్లామ్లలో కంటే వింబుల్డన్ను ఉన్నతంగా భావిస్తారు. టోర్నీ నిర్వహణ సన్నద్ధత నుంచి ఆటగాళ్ల డ్రెస్ కోడ్ వరకు వింబుల్డన్లో అన్ని పద్దతి ప్రకారం జరుగుతాయి. నిబంధనలు ఉల్లంఘిస్తే ఎంతటి స్టార్ ప్లేయర్స్ అయినా చర్యలు చవిచూడాల్సిందే. కరోనా వైరస్ (కోవిడ్-19) మహమ్మారి కారణంగా వింబుల్డన్ టోర్నీ నిలిచిపోయింది. ఈ ఏడాది వింబుల్డన్ను రద్దు చేస్తున్నట్టు నిర్వాహకులు గత వారం ప్రకటించారు. వింబుల్డన్ రద్దు టెన్నిస్ లోకాన్ని నిరాశపరిచింది. కానీ కరోనాతో మరే మార్గం లేదు. వింబుల్డన్ రద్దు అయినా, నిర్వాహకులు భారీ ఆదాయం ఆర్జించనున్నారు. వింబుల్డన్ టోర్నీకి మహమ్మారి బీమా సైతం ఉంది. గత 17 ఏండ్లుగా మహమ్మారి బీమా కోసం వింబుల్డన్ నిర్వాహకులు ఏటా రూ. 15 కోట్లు చెల్లిస్తున్నారు. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా వింబుల్డన్ రద్దు కావటంతో బీమా కింద రూ. 1071 కోట్లు రానున్నాయి. దీంతో వింబుల్డన్ ఆర్థిక కష్టాల నుంచి సులువుగా గట్టెక్కనుంది. వింబుల్డన్ తరహా బీమా ఐపీఎల్కు లేకపోవటంతో మార్కెట్ నిపుణులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. యూరోప్లో బీమా మార్కెట్తో పోల్చితే భారత బీమా మార్కెట్ భిన్నమని.. అందుకే ఐపీఎల్కు యుద్ధం, ఉగ్రవాదం బీమాలు మాత్రమే ఉన్నాయి. ఇక్కడి బీమా కంపెనీలు మహమ్మారి బీమా కిందకు చేర్చలేదని చెబుతున్నారు.