Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సెమీస్లో ఆదిలాబాద్, నిజామాబాద్,
- వరంగల్, కరీంనగర్ జట్లు
నవ తెలంగాణ-బోనకల్
ఖమ్మం జిల్లా బోనకల్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జరుగుతున్న రాష్ట్ర స్థాయి బాల్బ్యాడ్మింటన్ పోటీల సెమీస్లోకి ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్, కరీంనగర్ జట్లు చేరుకున్నాయి. శనివారం ఉదయం ప్రారంభమైన ఈ పోటీలు హోరాహోరిగా సాగాయి. ఫూల్-ఎ బాలుర విభాగంలో హైదరాబాద్, వరంగల్, ఖమ్మం జట్లపై ఆదిలాబాద్ విజయం సాధించింది. ఖమ్మం, హైదరాబాద్ జట్లు తలపడగా ఖమ్మం గెలుపొందింది. ఖమ్మం, హైద రాబాద్ జట్లపై వరంగల్ గెలిచింది. ఫూల్ 'బి'లో మహబూబ్నగర్, నల్లగొండ రంగారెడ్డి జట్లపై నిజామాబాద్ విజయం సాధించింది. మహబూ బ్నగర్, నిజామాబాద్, రంగారెడ్డి, నల్లగొండ జట్లపై కరీంనగర్ విజయం సాధించింది. మహబూబ్నగర్, నల్లగొండ తలపడగా నల్లగొండ జట్టు విజయం సాధించింది. మహబూబ్నగర్, రంగారెడ్డి తలపడగా రంగారెడ్డి విజయం సాధించింది.
బాల్బ్యాడ్మింటన్కు బోనకల్లు పుట్టినిల్లు: భట్టి విక్రమార్క
టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క పోటీలను ప్రారంభి ంచిన అనంతరం మాట్లాడుతూ.. బాల్బ్యాడ్మింటన్ పోటీలకు బోనకల్ మం డలం పుట్టినిల్లుగా మారిందన్నారు. బోనకల్, ముష్టికుంట్ల గ్రామాలకు చెందిన సుమారు 150 మంది గిరిజన విద్యార్థులు జాతీయ స్థాయి పోటీ ల్లోనూ అత్యు త్తమ ప్రతిభ కనబర్చి విజయాలను సాధించా రన్నారు. దీని వెనుక కోచ్ అమ రేసి లింగయ్య పాత్ర మరువలేనిదన్నారు. ఈ కార్యక్రమంలో బాల్ బ్యాడ్మింటన్ రాష్ట్ర అధ్యక్షులు ఎం.శ్రీనివాసరావు, కార్యదర్శి ఎ.రవీందర్, జిల్లా కార్యదర్శి బొంతు శ్రీనివాసరావు, కోచ్ అమరేశ్ లింగయ్య తదితరులు పాల్గొన్నారు.