Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-ఎన్ఓపీ ఆధారంగా ఆటలు: సారు
న్యూఢిల్లీ: స్టేడియంలు, స్పోర్ట్స్ కాంప్లెక్స్లు తెరుచుకోవడంతో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సారు)కూడా దశలవారీగా క్రీడలను తిరిగి ప్రారంభించడానికి సన్నాహాలను చేస్తోంది. దీనికోసం ప్రామాణిక ఆపరేటింగ్ ప్రొసీజర్ (ఎస్ఓపీ)ను సిద్ధం చేసింది. అథ్లెట్ల శిక్షణ దశలవారీగా ప్రారంభమవుతుందనీ, సారు క్రీడలను నాలుగు విభాగాలుగా విభజించబడి ఉన్నాయనీ.. ప్రతి విభాగానికి ఒక్కోరకంగా జాగ్రత్తలు తీసుకోవాలని ఎస్ఓపీ నిర్దేశించింది. నాన్-కాంటాక్ట్, మీడియం కాంటాక్ట్, ఫుల్ కాంటాక్ట్ మరియు వాటర్ స్పోర్ట్స్ అనే నాలుగు విభాగాలుగా క్రీడలు విభజించబడి ఉన్నాయని తెలిపింది. కరోనా కేసులను గుర్తించడానికి ప్రభుత్వ ఆరోగ్య సేతు యాప్ అథ్లెట్లు, కోచ్లు మరియు సిబ్బంది అందరి దగ్గర తప్పనిసరి ఉండాలని సూచించింది. ప్రతి క్రీడాంశ శిక్షణను తిరిగి ప్రారంభించడానికి ఒక్కోరకంగా విధానాలను రూపొందిస్తున్నట్టు పేర్కొంది. లాక్డౌన్ కారణంగా మార్చినుంచి సారు శిక్షణా శిబిరాలలో బస చేసిన అథ్లెట్లు మరియు సిబ్బందికి అన్ని సౌకర్యాలను కల్పిస్తున్నట్టు తెలిపింది. ప్రతి సారు కేంద్రం వద్ద ఒక కోవిడ్-19 టాస్క్ఫోర్స్ను ఏర్పాటు చేస్తున్నామనీ, ఆ కేంద్రాల్లో శిక్షణకు వచ్చే అథ్లెట్లు మరియు సిబ్బందిని వారే పర్యవేక్షించి మార్గనిర్దేశం చేస్తారని తెలిపింది. ఈ టాస్క్ఫోర్స్లో నేషనల్ స్పోర్ట్స్ ఫెడరేషన్(ఎన్ఎస్ఎఫ్) నుంచి చీఫ్ కోచింగ్ సిబ్బంది సభ్యులుగా కలిగి ఉంటారని, సెంటర్-ఇన్-ఛార్జ్ టాస్క్ఫోర్స్లోని ఎక్స్-అఫిషియో చైర్మెన్ మరియు ఎస్ఓపీలో వివరించిన ప్రోటోకాల్స్ అమలు బాధ్యత వారే చూస్తారని తెలిపింది. శిక్షణాకాలంలో అథ్లెట్లు ప్రోటోకాల్కు పూర్తిగా కట్టుబడి ఉండేలా చూడటం, ప్రోటోకాల్లకు పూర్తిగా అనుగుణంగా ఉండేలా అథ్లెట్ల నుండి ఒప్పందం కుదుర్చుకోవడం ఎన్ఎస్ఎఫ్ల బాధ్యత. శిక్షణ తిరిగి ప్రారంభించే ముందు శిక్షణా కేంద్రాలన్నింటినీ క్రిమిసంహారక మందు పిచికారీ చేసే బాధ్యత ఎస్ఓపీదే. అనుమానిత, కోవిడ్-19 కేసులను గుర్తించే బాధ్యత కూడా వీరిదేనని పేర్కొంది.