Authorization
Mon Jan 19, 2015 06:51 pm
లండన్: ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు(ఈసీబీ) క్రికెట్ పునరుద్దరణకు కీలక నిర్ణయాలు తీసుకుంది. లాక్డౌన్తో ఇంటికే పరిమితమైన ఆటగాళ్లకు ఆరోగ్యకరమైన వాతావరణంలో ప్రత్యేక ట్రైనింగ్ ఇవ్వాలని భావించింది. దీనిలో భాగంగా ఇంగ్లండ్లోని ఏడు మైదానాలను ఎంపిక చేసి 18 మంది బౌలర్లకు ప్రత్యేక శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాట్లను పూర్తి చేసింది. ఒక సమయంలో కేవలం ఒక క్రికెటర్కు మాత్రమే గ్రౌండ్లో ప్రాక్టీస్ చేసే వెసులుబాటు కల్పించింది. దీనిలో భాగంగా స్టువార్ట్ బ్రాడ్ ట్రెంట్బ్రిడ్జ్లో, క్రిస్ వోక్స్ ఎడ్జ్బాస్టన్లో కాసేపు ప్రాక్టీస్ చేశారు. దీంతో కరోనా విరామం తర్వాత మైదానంలోకి దిగిన తొలి క్రికెటర్లుగా బ్రాడ్, వోక్స్లు నిలిచారు.