Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కోచ్ గోపీచంద్కు తల్లిదండ్రుల లేఖ
హైదరాబాద్ : ప్రపంచ బ్యాడ్మింటన్ ఫెడరేషన్(బిడబ్ల్యుఎఫ్) టోర్నీలను ఆగస్టునుంచి ప్రారంభించనున్నట్టు ప్రకటించడంతో సింధు, సిక్కిరెడ్డిలకు ప్రత్యేక శిక్షణ అవసరమని వారి తల్లిదండ్రులు విజ్ఞప్తి చేశారు. సింధు తండ్రి పివి రమణ తన కుమార్తెకు ఫిజికల్గా చాలా సమస్యలున్నాయని, అందరు షట్లర్లతో కలిసి సాధన చేస్తుంటే చేతి తొడుగులు, సామాజిక దూరం సమస్యగా మారుతుందన్నారు. ముఖ్యంగా విశ్రాంతి తీసుకునే బెంచ్లపైనా షట్లర్లందరూ కూర్చుంటారు కాబట్టి వాటిని ప్రతిసారీ శుభ్రపరచాల్సి ఉంటుందన్నారు. వీటన్నింటి దృష్ట్యా స్టార్ షట్లర్లకు ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని కోరుతూ గోపీచంద్కు లేఖను రాశారు. సానుకూలంగా స్పందించిన బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ స్టార్ ఆటగాళ్ల ఆరోగ్యం దృష్ట్యా తప్పక నెరవేరుస్తానని హామీ ఇచ్చారు. అకాడమీలో శిక్షణకు అధికసంఖ్యలో షట్లర్లు హాజరౌతున్నారని, స్టార్ ఆటగాళ్లకు ప్రత్యేక వసతులతో శిక్షణ అవసరమేనని గోపీచంద్ అంగీకరించారు.