Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-పోటీలన్నీ మార్చి నుంచే ప్రారంభం : ఐసీసీ
దుబారు: క్రికెట్ తిరిగి ప్రారంభమైతే బౌలర్లు టెస్టుల్లో పాల్గొనాలంటే కనీసం రెండు లేదా మూడు నెలల ప్రాక్టీస్ ఉండాలని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) తెలిపింది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో క్రికెట్ పోటీలన్నీ మార్చి నుంచి నిలిచిపోయాయని, క్రికెట్ తిరిగి ప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో బౌలర్లు నెట్స్లో చెమటోడ్చాల్సి ఉంటుందని తెలిపింది. జులైలో ఇంగ్లండ్, వెస్టిండీస్ మధ్య టెస్ట్ సిరీస్.. ఆ తర్వాత ఆగస్టులో పాకిస్థాన్ జట్టు ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లే అవకాశాలు ఉన్నాయని ఐసీసీ తెలిపింది. ఐసీసీ శుక్రవారం విడుదల చేసిన గైడ్లైన్స్లో చాలాకాలంగా ఆటకి దూరంగా ఉంటున్న బౌలర్లు తిరిగి మైదానాల్లో అడుగుపెడితే త్వరగా గాయాలపాలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయని పేర్కొంది. ఎక్కువ మంది సభ్యులతో.. ఎనిమిది లేదా 12 వారాల ప్రాక్టీస్ బౌలర్లతో చేయించాలని ఐసీసీ అన్ని క్రికెట్ బోర్డులకు సూచించింది. ఆరు వారాల సమయంలో ప్రాక్టీస్ చేసిన బౌలర్లు వన్డే, టి20 ఫార్మాట్కు ఆడగలరని తెలిపింది. టెస్టుల్లో ఆడాలంటే.. అంతకంటే ఎక్కువ వారాలు ప్రాక్టీస్ అవసరమని పేర్కొంది.
ఐపీఎల్ అత్యుత్తమ టోర్నీ: బట్లర్
వన్డే, టీ20 ప్రపంచకప్ తర్వాత అత్యుత్తమ టోర్నీ ఐపీఎల్యే అని ఇంగ్లండ్ ఆటగాడు జాస్ బట్లర్ అభిప్రాయపడ్డాడు. కరోనా వైరస్ అనంతరం క్రికెట్ సీజన్ ఐపీఎల్తోనే ప్రారంభమౌతుందని బలంగా నమ్ముతున్నానని తెలిపారు. ఇంగ్లండ్ ఆటగాళ్లు ఎందరో ఐపీఎల్ ఆడటం వల్ల లాభపడ్డా రని, తాను ఐపీఎల్లో ఆడేందుకు మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్ కారణమని తెలిపాడు. ఐపిఎల్తో ఇంగ్లండ్ క్రికెట్కి మంచి సంబంధం ఉందని, అందరి అడ్డంకులను పీటర్సన్ తొలగించారని, ఐపీఎల్ ఆడేందుకు మా అందరికీ ఆయనే బాటలు వేశారన్నారు. క్రికెటర్లు ఐపీఎల్లో ఆడటం ఎంత ముఖ్యమో తెలిసేలా చేశారని బట్లర్ పేర్కొన్నారు.
ఐసీసీ బౌలర్లకు మార్గనిర్దేశకాలు జారీచేయడంతో భారత పేస్బౌలర్ శార్దూల్ ఠాకూర్ శనివారం ప్రాక్టీస్ మొదలుపెట్టాడు. దీంతో కరోనా వైరస్ అనంతరం తిరిగి మైదానంలో ప్రాక్టీస్ మొదలుపెట్టిన తొలి భారత బౌలర్గా శార్దూల్ నిలిచాడు. ముంబయిలోని పాల్ఘర్ దహాను తాలూకా స్పోర్ట్స్ అసోసియేషన్లో అండర్-23 బ్యాట్స్మన్ శిరాజ్ పాటిల్ మరియు హార్దిక్ టమోరోలకు నెట్స్లో బంతులను విసిరి సాధనచేశాడు.