Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: అథ్లెట్లు బహిరంగ శిక్షణలకు హాజరయ్యేందుకు ప్రభుత్వం అనుమతించినప్పటికీ మహిళా షూటర్లు, రెజర్లు విముఖత చూపుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో బహిరంగ శిక్షణలకు వెళ్ళడం మంచి నిర్ణయం కాదని టాప్ షూటర్ మను భాకర్ అభిప్రాయపడగా.. రెజ్లర్లు పూజా ధండా, దివ్య కక్రాన్మాత్రం కోచ్లు తెలిసిన వారైనా.. చుట్టూ పరిస్థితులు అనుకూలంగా లేవన్నారు. యువ షూటర్ మను భాకర్ మాత్రం బహిరంగ శిక్షణలకు వెళ్లడం తనకు ఇష్టంలేదని, ప్రస్తుత పరిస్థితుల్లో ఇది అంత మంచి నిర్ణయం కాదన్నారు. నమ్మకముంటే తప్ప తాను ఏ శిక్షణా శిబిరానికి వెళ్ళబోనని నిఖార్సుగా చెప్పారు. ఇంట్లో సారునుంచి అందిన షూటింగ్ పరికరాలు ఉన్నాయని, ప్రస్తుతం ఇంట్లోనే సాధన చేస్తున్నానని ఆమె తెలిపారు. మేజర్ టోర్నీలు ప్రారంభమయ్యేవరకు, కరోనా వైరస్ నియంత్రణలోకి వచ్చేవరకు తాను బహిరంగ శిక్షణలకు వెళ్ళనని భాకర్ తెలిపారు. రెజ్లర్ పూజా ధండా మాట్లాడుతూ..
ఇంట్లో ఎలా సాధన చేయాలనే దానిపై తనకు ఒక ఆలోచన ఉందన్నారు. కరోనా వైరస్ వేగాన్ని చూస్తుంటే ఇంట్లో వేచి ఉండడమే మంచిదని భావిస్తున్నట్టు ఆమె తెలిపారు. రెజ్లింగ్లో శిక్షణకు తప్పనిసరిగా మరో భాగస్వామి అవసరమని, వారు తెలిసినవారైనప్పటికీ తాను బహిరంగ శిక్షణకు వెళ్ళనన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో వ్యక్తిగత శిక్షణకు ఇళ్లే ఉత్తమమని ఆమె అభిప్రాయపడ్డారు. ఆసియా రెజ్లింగ్ ఛాంప్ దివ్య కక్రాన్ మాత్రం బహిరంగ శిక్షణకు ఇది తగిన సమయం కాదని, లాక్డౌన్ ముగిసేవరకూ ప్రాక్టీస్కు వెళ్ళనన్నారు. తెలిసిన వారే శిక్షణలిస్తున్నా.. చుట్టూ పరిస్థితులు అనుకూలంగా లేవని కక్రాన్ తెలిపారు.