Authorization
Mon Jan 19, 2015 06:51 pm
భారత టెన్నిస్ సంచలనం సానియా మీర్జా సోమవారం రంజాన్ పర్వదినం సందర్భంగా తన కుమారుడు ఇజాన్ మీర్జా మాలిక్తో దిగిన ఓ ఫొటోను ట్విటర్లో పోస్ట్ చేశారు. 'రంజాన్ ఈద్ పండగ వేడుకలు' అంటూ ఆమె క్యాప్షన్ జత చేశారు.
కరోనా నేపథ్యంలో రంజాన్ పండుగను సానియా ఇంట్లోనే నిర్వహించు కున్నట్టు తెలిపారు. తెల్లని కుర్తాను ధరించిన సానియా, ఆమె కొడుకు ఇజాన్స్ కూడా సంప్రదాయ దుస్తుల్లో అందంగా కనిపించారు. 'లాక్ డౌన్ సమయంలో నేను మా కుంటుంబ సభ్యులతో ఇంట్లోనే ఉంటూ రంజాన్ పండగ చేసుకు న్నాను. దయ చేసి మీరు కూడా ఇంట్లోనే ఉండాలి' అని సానియా ట్వీట్లో తెలిపారు.