Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : సుమారు రెండు నెలల లాక్డౌన్ విరామం తరువాత ట్రాక్ అండ్ ఫీల్డ్ అథ్లెట్లు సోమవారం నుంచి అవుట్డోర్ ట్రైనింగ్లో పాల్గొ న్నారు. సారు ప్రకటించిన మార్గదర్శకాల ప్రకారం అథ్లెట్లు ఈ ట్రైనింగ్ నిర్వహించారు. ఈ మార్గ దర్శకాల్లో ముఖ్యమైనది భౌతిక దూరం పాటించ డం. కాగా, సుదీర్ఘ విరామం తరువాత ఈ ట్రైనింగ్ లో పాల్గొనడంపై భారత స్పింటర్ ద్యుతీ చంద్ సంతోషం వ్యక్తం చేశారు. 'ట్రాక్స్ ప్రారంభించి నందుకు కృతజ్ఞతలు. ఇన్ని రోజులూ లాక్డౌన్తో ఇంటి లోనే కూర్చున్నాం. నా ఫిట్నెస్ను మళ్లీ దక్కించుకోవ డానికి టైం పడుతుంది. నా ఫిట్నెస్ను పెంచుకో వడంపై ప్రస్తుతం నా దృష్టి ఉంది' అని ఆమె తెలిపింది. ట్రాక్ అండ్ ఫీల్డ్లో టోక్యో ఒలింపిక్సకు అర్హత సాధించడానికి జులై 5 వరకూ గడవు ఉంది. కాగా, అవుట్డోర్ ఫిట్నెస్ను సోమవారం నుంచి ఎన్ఐఎస్ పాటియాల, బెంగళూరు, ఊటీల్లోని సారు కేంద్రాల్లో ప్రారంభిం చారు. ఈ ట్రైనింగ్లో అథ్లెట్లు ప్రధానంగా గాయా లకు గురికాకుండా తమ ఫిట్నెస్ను రక్షించడంపై దృష్టి పెట్టారు..కరోనా వైరస్ నేపథ్యంలో విధించిన నిబంధనల్ని ఈ నెల 17న కేంద్రం సడలించిన సంగతి తెలిసిందే. వీటిల్లో స్టేడియంలను ఉపయోగించుకోవడం, స్పోర్ట్స్ కాంప్లెక్స్ల్ని ప్రారంభించడం వంటివి ఉన్నాయి.