Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-ఉపాధ్యక్షుడిని కోరిన ఐఓఏ చీఫ్
- ఒలింపిక్ సంఘంలో ముదిరిన వివాదం
న్యూఢిల్లీ: భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ)లో మరోసారి అంతర్గత కుమ్ములాటలు మొదలయ్యాయి. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆఫీస్ బేరర్లు వర్గాలు చీలిపోతున్నారు. భారత ఒలింపిక్ సంఘం అధ్యక్షుడు నరెందర్ ధ్రువ్ బత్రా ఏకపక్షంగా వ్యవహరిస్తున్నాడని కార్యదర్శి రాజీవ్ మెహతా విమర్శలు చేయగా.. ఐఓఏ సబ్ కమిటీలను బత్రా రద్దు చేస్తూ పోతున్నారు. దీంతో ఒలింపిక్ సంఘంలో మరోసారి ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఉపాథ్యక్షుడు అనిల్ ఖన్నా సారథ్యంలోని ఎథిక్స్ కమిటీని బత్రా ఇటీవల రద్దు చేసిన సంగతి తెలిసిందే. బత్రా ఏకపక్ష నిర్ణయం చెల్లదని వాదించిన రాజీవ్ మెహతా, కమిటీని పున ప్రతిష్టించాడు. దీంతో వర్గ రాజకీయాలను బత్రా మరో ఎత్తు వేశాడు. 2020 టోక్యో ఒలింపిక్స్ హౌటల్ గదుల బుకింగ్స్లో వచ్చిన నష్టానికి వివరణ ఇవ్వాల్సిందిగా అనిల్ ఖన్నాను కోరారు. సీనియర్ ఉపా ధ్యక్షుడు అనిల్ ఖన్నా ఫైనాన్స్ కమిటీ చీఫ్గా ఉన్న సమయంలోనే 2020 ఒలింపిక్స్ హౌటల్ గదు ల బుకింగ్స్ చోటుచేసుకున్నాయి. ' జూన్ 2019న హౌటల్ గదుల బుకింగ్కు, నాతో సంతకం చేయించిన సమయానికి రోజుకు రూ. 58000 టారీఫ్ చూపించారు. ఫైనాన్స్ కమిటీ చీఫ్గా బుకింగ్స్కు జూన్లోనే గ్రీన్ సిగల్ ఇవ్వకుండా జాప్యం చేశారు. 2020 ఫిబ్రవరిలో టారీఫ్ రూ. 87000కు చేరింది. ఫలితంగా ఐఓఏకు రూ. 70 లక్షల నష్టం వాటిల్లింది. అందుకు సంజాయిషీ ఇవ్వండి' అని ఆనంద్ ఖన్నాకు రాసిన లేఖలో ఐఓఏ బాస్ బత్రా కోరాడు.