Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్(ఐఓసీ) అధ్యక్షులు నరిందర్ బత్రా ఒలింపిక్ ఛానల్ కమిషన్ సభ్యునిగా ఎన్నికయ్యారు. అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ అధ్యక్షులు థామస్ బాచ్కు రాసిన లేఖలో గత ఏడాది ఐఓసీ అధ్యక్షునిగా ఎన్నికైన బత్రాను ఈ పదవికి ఎంపిక చేస్తున్నట్టు శుక్రవారం ఓ ప్రకటనలో ఐఓసి తెలిపింది. 'ఒలింపిక్ ఛానల్ కమిషన్' సభ్యునిగా ఎంపికపట్ల బత్రా హర్షం వ్యక్తం చేస్తూ.. తన ఎంపికకు కారణమైన ప్రతి ఒక్కరికీ కతజ్ఞతలు తెలుపుతున్నాననీ, అదనపు బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వర్తిస్తానన్నారు. 63ఏండ్ల బత్రా ఇంతకుముందు హాకీ ఇండియా(హెచ్ఐ), ఆసియా హాకీ సమాఖ్యలకు అధ్యక్షునిగా, ఢిల్లీ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్కు 2003-2013లో కోశాధికారిగా పనిచేశారు.