Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వరల్డ్ క్రికెటర్లది తొలిప్రాధాన్యమే
- టీ20 కన్నా ఎక్కువ లీగ్ మ్యాచులు ఆడిన కోహ్లి
నవతెలంగాణ..క్రీడాప్రతినిధి
అంతర్జాతీయ క్రికెట్లో టీ..20 లీగ్కు ముప్పుగా మారనున్నది. ఫుట్బాల్.. బాస్కెట్బాల్ తరహాలో క్రికెట్కూ ఆదరణ పెరుగుతున్నది.టీ..20 కన్నా ఇండియన్ ప్రిమియర్ లీగ్ (ఐపీఎల్) ఆటగాళ్ళు లీగ్కు ప్రాధాన్యత ఇస్తున్నారు. భారత్లో నిర్వహించే ఐపీఎల్ వరల్డ్ క్రికెటర్లను ఊరిస్తున్నది. ఇక భారత్ విషయానికివస్తే.. కెప్టెన్ విరాట్ కోహ్లీ 2010 నుంచి 82 అంతర్జాతీయ టీ.. 20 లను ఆడాడు. ఈ సమయంలో జట్టు 109 మ్యాచ్లు ఆడింది. 2008 నుంచి ఐపీఎల్లో కోహ్లీ 177 మ్యాచ్లు ఆడాడు. కాగా జట్టు 181 మ్యాచ్లు ఆడింది. ప్రతి సంవత్సరం అంతర్జాతీయ క్రికెట్ నుంచి బీసీసీఐకి వచ్చే ఆదాయాన్ని ఐపీఎల్ రెట్టింపు చేస్తుంది. భవిష్యత్తులో, ద్వైపాక్షిక సిరీస్ తక్కువగా ఉంటుందనే చర్చ నడుస్తున్నది.
ఐపీఎల్లో పెరగనున్న జట్లు
క్రికెట్లో బీసీసీఐ ప్రపంచంలోని ఇతర బోర్డులకన్నా అటు ఆర్థికంగానూ..ఇతర విషయాల్లోనూ బలంగానే ఉన్నది. కరోనా కారణంగా ప్రస్తుతం ఐపీఎల్ మ్యాచులు వాయిదాపడ్డాయి. అక్టోబర్..నవంబర్ల మధ్య పోటీలు నిర్వహించే ఛాన్స్ ఉన్నట్టు బీసీసీఐ సంకేతాలిస్తున్నది. అప్పటిలోగా కరోనా వైరస్ కేసులు తగ్గుతాయా..లేక మరిన్ని మరణాలు సంభవిస్తే..పరిస్థితేంటనీ బోర్డు తర్జనభర్జనపడుతున్నది. ఇది ప్రస్తుత సీజన్ గురించి బీసీసీఐకు బెంగపట్టుకుంటే.. మరోవైపు ఐపీఎల్లో జట్ల సంఖ్యను 2023 నుంచి పెంచాల్సి ఉన్నది. అపుడు భారత్లోని ఇతర జట్లతో మ్యాచ్లు తగ్గుతాయి. ఇది ఆ దేశాల ఆదాయంపై ప్రభావితం చేస్తుందని క్రీడావిశ్లేషకులు అంటున్నారు. ఇలాంటి పరిస్థితులు ఎదురైతే... అన్ని దేశాలు లీగ్ను నిర్వహించడం ద్వారా ఆదాయాన్ని పెంచడానికి సిద్ధమవుతాయని వారు చెబుతున్నారు. ఐపీఎల్లో బౌలర్ కమ్మిన్స్కు నాలుగురెట్లు ఎక్కువ మనీ ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ పాట్ కమ్మిన్స్ 2019 లో చేసుకున్న ఒప్పందం ప్రకారం 417 మిలియన్లు (4.7కోట్లు) అందుకున్నాడు. టెస్టులో నంబర్ వన్ బౌలర్ 2019 లో 7 మ్యాచులు.. టీ 20 ఇంటర్నేషనల్స్ ఆడాడు. అతనికి సుమారు 8 లక్షలు వచ్చింది. అదే సమయంలో మొత్తం 4.25 కోట్లు పొందాడు. ఐపీఎల్కు వచ్చేసరికి.. 2020 లో కోల్కతా నైట్ రైడర్స్ అతన్ని 15.15 కోట్లకు వేలంలో కొన్నది. లీగ్లో 14 నుంచి 17 మ్యాచ్లు కమ్మిన్స్ ఆడాల్సి ఉంటుంది. అంటే సగటు మ్యాచ్లో సుమారు కోటి రూపాయలు అందుతాయి.
కరోనా దెబ్బకు క్రికెట్పై ప్రభావం
కరోనా కారణంగా క్రికెట్పై ప్రభావం ఉండబోతున్నది అంచనా.ఖర్చులు పెరిగేఛాన్స్ ఉన్నది. అందువల్ల ఆయా దేశాల క్రికెట్ టీములు అంతర్జాతీయ సిరీస్ను తక్కువగా ఆడే అవకాశాలున్నాయి. మరోవైపు అంతర్జాతీయ సిరీస్ నిర్వహించటం వల్ల క్రికెట్ బోర్డులపై భారం పడనున్నది. బయో-సేఫ్టీ, చార్టర్డ్ విమానాలు.. ఆయా దేశాలనుంచి వచ్చే జట్లను అన్ని విధాల కరోనా పరీక్షలు జరపాల్సిఉంటుంది.