Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐసీసీకి ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు వినతి
లండన్ : పేస్ బౌలర్ల భీకర దాడిలో గాయపడిన బ్యాట్స్మెన్ కోసం ఇటీవల కంకషన్ (తల అదరటం) సబ్స్టిట్యూట్ నిబంధన తీసుకొచ్చిన ఐసీసీకి.. ఇప్పుడు కరోనా వైరస్ కారణంగా మరో నిబంధన జోడించాల్సిన అవసరం ఏర్పడింది. బయో సెక్యురిటీ, సహా ఇతర ముందు జాగ్రత్తలు తీసుకుని టెస్టు మ్యాచులు నిర్వహిస్తున్నా.. మ్యాచ్ మధ్యలో ఓ ఆటగాడికి కోవిడ్-19 సోకితే ఏమిటనే ప్రశ్నకు ఐసీసీ సమాధానం కనుగొనాల్సి ఉంది. ప్రస్తుత ప్రభుత్వ నిబంధనల ప్రకారం కోవిడ్ బాధితుడితో సన్నిహితంగా ఉన్నవారందరూ క్వారంటైన్లో ఉండాలి. టెస్టు మ్యాచ్ మధ్యలో క్రికెటర్కు కరోనా సోకితే రెండు జట్ల క్రికెటర్లు సహా మ్యాచ్ అధికారులూ క్వారంటైన్కు వెళ్లాల్సి ఉంటుందనే హెచ్చరికలు వినిపిస్తూనే ఉన్నాయి. జులైలో వెస్టిండీస్తో స్వదేశంలో మూడు మ్యాచుల టెస్టు సిరీస్కు రంగం సిద్ధం చేసుకున్న ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు ఇప్పుడు ఐసీసీ వద్దకు వచ్చింది. కరోనా వైరస్ తీసుకొచ్చిన ముప్పుతో ఇప్పుడు టెస్టు మ్యాచుల్లో కరోనా సబ్స్టిట్యూట్ అవకాశం కల్పించాలని కోరింది. దీనిపై ఐసీసీ, క్రికెట్ కమిటీ ఏ విధంగా స్పందిస్తాయో చూడాలి.