Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-సిరీస్కు ఆమోదం తెలిపిన కరీబియన్లు
సెయింట్ జాన్స్ (ఆంటిగ్వా) : అంతర్జాతీయ క్రికెట్ మరో నెల రోజుల్లో పున ప్రారంభం కానుంది. మూడు మ్యాచుల టెస్టు సిరీస్ కోసం వెస్టిండీస్ జట్టు ఇంగ్లాండ్లో పర్యటించేందుకు గ్రీన్ సిగల్ ఇచ్చింది. ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లేందుకు సిద్ధమని వెస్టిండీస్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ నిర్ణయించారు. ' ఇంగ్లాండ్లో పర్యటనకు విండీస్ క్రికెట్ బోర్డు ఆమోదం తెలిపింది. విండీస్ వైద్య బృందం, ఇంగ్లాండ్ బోర్డుతో సంబంధిత చర్చలు, ఇతర అంశాలను పరిశీలించిన తర్వాత ఈ నిర్ణయం అమల్లోకి వస్తుంది' అని విండీస్ బోర్డు తెలిపింది. జులై 8న తొలి టెస్టుకు షెడ్యూల్ చేసిన ఇంగ్లాండ్.. రెండు వేదికల్లో సిరీస్కు ప్రణాళిక చేసింది. ఓల్డ్ ట్రాఫోర్డ్, హంప్షైర్లలో మూడు టెస్టులు జరుగనున్నాయి. ఈ రెండు వేదికల్లోని స్టేడియాల్లోనే హౌటల్స్ ఉండటంతో ఇంగ్లాండ్ వీటిని ఎంచుకుంది. జూన్ ఆఖరు వారంలో వెస్టిండీస్ జట్టు ఇంగ్లాండ్కు బయల్దేరే అవకాశం ఉంది. కరీబియన్ దీవుల్లోని పలు ప్రభుత్వాలతో క్రికెట్ బోర్డు ఇప్పుడు సంప్రదింపుల ప్రక్రియ మొదలు పెట్టనుంది. భిన్న ప్రాంతాల్లో ఉన్న క్రికెటర్లను ప్రత్యేక రవాణా ద్వారా తీసుకొచ్చేందుకు చర్చలు జరపాల్సి ఉంది.