Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రకటించిన విండీస్ క్రికెట్ బోర్డు
సెయింట్ జాన్స్ (ఆంటిగ్వా): ఆర్థిక సమస్యలతో చాలాకాలంగా సహజీవనం చేస్తోన్న క్రికెట్ వెస్టిండీస్ బోర్డు.. కరోనా వైరస్ కారణంగా వేతనంలో కోతకు సిద్ధపడింది. ఆర్థిక సంక్షోభం ప్రమాదం ముంగిట నిలిచిన వెస్టిండీస్ క్రికెట్ బోర్డు రానున్న ఆరు నెలలకు క్రికెటర్లు, సిబ్బంది, సహాయక సిబ్బంది, అంపైర్లకు సగం వేతనాలే చెల్లించనుంది. శనివారం సమావేశమైన వెస్టిండీస్ క్రికెట్ బోర్డు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. కరోనా వైరస్ కారణంగా క్రికెట్ నిలిచిపోవటం, భవిష్యత్ ఆశాజనంగా లేకపోవటంతో తాత్కాలిక వేతన కోత నిర్ణయం తీసుకున్నామని ఓ ప్రకటనలో తెలిపింది. పాత బకాయిల కోసం ఎదురుచూస్తోన్న క్రికెటర్లకు ఇప్పుడు సగం జీతం వార్త మరింత నిరుత్సాహానికి గురిచేస్తుందని చెప్పవచ్చు. వేతనాల కోత నిర్ణయం జులై 1 నుంచి అమల్లోకి వస్తుందని విండీస్ క్రికెట్ బోర్డు ప్రకటనలో తెలిపింది.