Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- క్రికెట్పై కరోనా ప్రభావంపై కోహ్లి
న్యూఢిల్లీ : కరోనా వైరస్ కారణంగా ప్రపంచ క్రికెట్లో ఎటువంటి మార్పులు చేసుకుంటాయనే చర్చ సర్వత్రా నడుస్తోంది. అంపైర్లు బంతిని పట్టుకునే అవకాశం ఉండదని.. బౌలర్లు తమ టవల్స్, అద్దాలు, క్యాప్లు అంపైర్లకు ఇచ్చే అలవాటు మానుకోవాల్సిందేనని, బంతినీ శానిటైజ్ చేయాల్సి ఉంటుందని పలు అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బంతిపై ఉమ్మి వాడవద్దనే సూచన మాత్రమే ఇప్పటివరకు ఐసీసీ నుంచి వెలువడింది. పలు అంశాలపై ఐసీసీ మరింత స్పష్టమైన మార్గదర్శకాలు వెల్లడించాల్సి ఉంది. ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్తో ఇన్స్టాగ్రామ్ లైవ్లో మాట్లాడిన విరాట్ కోహ్లి.. ఈ అంశంపై స్పందించాడు. ' కరోనా వైరస్ కారణంగా ఆటలో చోటుచేసుకునే మార్పులా? నిజంగా ఏం జరుగబోతుందో నాకు తెలియదు. ఆలోచన చేయడానికి సైతం వింతగా ఉంది. ప్రాక్టీస్ సెషన్లలో సైతం కరచాలనం చేయటం ఇక ఉండదేమో. చాలా కాలం తర్వాత కలుస్తున్న భావన ఉన్నప్పటికీ, ఇప్పుడు కరచాలనం ఇవ్వలేం. నమస్కారం చేసి దూరంగానే ఉండాలి. ఇప్పటికి ఇది విచిత్రంగా ఉండవచ్చు. కానీ క్రికెట్లో కొన్ని మార్పులు శాశ్వతంగా ఉండిపోవచ్చు. కరోనా వైరస్కు వ్యాక్సిన్ కనుగొనే వరకైనా క్రికెట్లో మార్పులు అనివార్యం. త్వరగానే అందరూ కరోనా మార్పులకు అలవాటు పడతారు' అని విరాట్ కోహ్లి అన్నాడు.