Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-కొలంబోలో నేటి నుంచి ఆరంభం
కొలంబో : కరోనా విరామం అనంతరం శ్రీలంక క్రికెటర్లు మైదానంలోకి అడుగుపెట్టనున్నారు. మధ్యప్రాచ్య దేశాల నుంచి వచ్చినవారు, క్వారంటైన్ కేంద్రాల్లో ఉన్న వారిలో 500 మందికి పైగా కోవిడ్-19 పాజిటివ్గా తేలారు. శ్రీలంకలో ఓ వారం వ్యవధిలో ఈ స్థాయి కేసులు నమోదు కావటం ఇదే తొలిసారి. అయినా, క్రికెట్ పునరుద్ధరణకు శ్రీలంక క్రికెట్ బోర్డు ముందుకు సాగుతోంది. 13 మందితో కూడిన జట్టుతో కొలంబో క్రికెట్ క్లబ్లో ప్రాక్టీస్ సెషన్కు ఏర్పాట్లు చేసింది. 12 రోజుల పాటు జరుగనున్న ఈ ప్రాక్టీస్ సెషన్లో క్రికెటర్లు హౌటల్, గ్రౌండ్కు మాత్రమే పరిమితం కానున్నారు. వ్యక్తిగత పనులకు హాజరయ్యేందుకు శ్రీలంక బోర్డు అనుమతి నిరాకరించింది. సురంగ్ లక్మల్, నువాన్ ప్రదీప్, ఇసురు ఉదాన, కసున్ రజిత, లహిరు కుమార, వహిందు హసరంగ, లసిత్ సహా కుశాల్ పెరీరా, దనుష్క గుణతిలకలు ఈ రెసిడెన్షియల్ క్యాంప్లో పాల్గొననున్నారు. చీఫ్ కోచ్ మికీ ఆర్థర్, బ్యాటింగ్ కోచ్ గ్రాంట్ ఫ్లవర్ క్యాంప్ను పర్యవేక్షించనున్నారు. భారత్తో టీ20 సిరీస్ జరగాల్సి ఉన్నా, బీసీసీఐ నుంచి ఎటువంటి హామీ లేదు. శ్రీలంక క్రికెట్ బోర్డు జులై ఆరంభంలో అంతర్జాతీయ క్రికెట్ సీజన్ మొదలు అవుతుందని ఆశిస్తోంది.