Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-అర్జునకు లౌవ్లీనా, సిమ్రన్, మనీష్
-బాక్సింగ్ ఫెడరేషన్ సిఫార్సు
న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక రాజీవ్గాంధీ ఖేల్రత్న 2020 అవార్డుకు బాక్సింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(బిఎఫ్ఐ) అమిత్ పంగల్, వికాస్ కిషన్ పేర్లను ప్రతిపాదించింది. అర్జున అవార్డుకు లౌవ్లీనా, సిమ్రన్జిత్ కౌర్, మనీష్ కౌషిక్లను సిఫార్సు చేసినట్లు సోమవారం తెలిపింది. అమిత్ 52 కిలోల బాక్సింగ్ విభాగంలో ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకం గెలిచాడు. మూడేళ్లుగా అమిత్ పేరును అర్జున అవార్డుకు ప్రతిపాదిస్తున్నా అవార్డు దక్కలేదని, ఇప్పటివరకూ ఏ జాతీయ అవార్డుతోనూ గౌరవం పొందలేకపోయాడు. ఇక వికాస్ కిషన్ 69కిలోల విభాగంలో కామన్వెల్త్, ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకాన్ని గెలిచాడు. 2012లో అర్జున అవార్డును పొందాడు. వీరిద్దరూ ఇప్పటికే టోక్యో ఒలింపిక్స్కు అర్హత సాధించడంతో వీరిని ఖేల్రత్నకు సిఫార్సు చేసినట్లు బిఎఫ్ఐ తెలిపింది. ఇక లౌవ్లీనా(69కిలోలు), సిమ్రన్జిత్ కౌర్(64కిలోలు), మనీష్ కౌషిక్(63కిలోలు)ను అర్జున అవార్డుకు నామినేట్ చేసింది. ద్రోణాచార్య అవార్డుకు జాతీయ మహిళల కోచ్ మహ్మద్ అలీ ఖమర్ మరియు అసిస్టెంట్ కోచ్ ఛోటేలాల్ యాదవ్ను ప్రతిపాదించింది. ఛోటేలాల్ యాదవ్.. మేరీకోమ్ ఆరుసార్లు ప్రపంచ ఛాంపియన్గా నిలిచేందుకు దోహదపడ్డారు. ప్రతిష్టాత్మక ధ్యాన్చంద్ అవార్డుకు ఎన్. ఉష పేరును సిఫార్సు చేయగా.. నామినేషన్ల స్వీకరణకు బుధవారం(జూన్ 3) చివరిరోజు.