Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చాంప్స్ కరీంనగర్ (గర్ల్స్), ఆదిలాబాద్ (బాయ్స్)
నవతెలంగాణ- బోనకల్ : 61వ బాల్బ్యాడ్మింటన్ జూనియర్ రాష్ట్రస్థాయి పోటీల్లో ఆదిలాబాద్ జట్టు విజేతగా నిలిచింది. బాలికల విభాగంలో కరీంనగర్ గెలుపొందింది. ఆదివారం జరిగిన ఫైనల్లో బాలుర విభాగంలో ఆదిలాబాద్, కరీంనగర్ జట్లు తలపడ్డాయి. ఆదిలాబాద్ జట్టు విజయం సాధించింది. బాలికల విభాగంలో కరీంనగర్, వరంగల్ జట్లు తలపడగా కరీంనగర్ గెలుపొందింది. అనంతరం విజేతలకు బహుమతులు అందచేశారు.
జాతీయ స్థాయి పోటీలకు జట్ల ఎంపిక: చత్తీస్గఢ్ రాష్ట్రం బలాయిలో ఈ నెల 24 నుంచి 28వరకు జరిగే 61వ జాతీయ స్థాయి సీనియర్ బాల్బ్యాడ్మింటన్ పోటీల్లో పాల్గొనే బాలుర, బాలిక జట్లను ఎంపిక చేశారు.
బాలుర విభాగం: ఎస్.అజరు (ఆదిలాబాద్),డి.ప్రణరు(కరీంనగర్), పి.ప్రశాంత్(వరంగల్),ఎం.మనోజ్కుమార్(రంగారెడ్డి),ఎన్.శ్రీనివాస్ (ఆదిలా బాద్), కె.రజనీకాంత్(కరీంనగర్), కె.ఆనంద్(నిజామాబాద్), నవనేతరావు (హైద రాబాద్), టి.దిలీప్(ఆదిలాబాద్), డి.సాయికిరణ్ (కరీంనగర్), ఎ.గణేష్ (నల్ల గొండ), సిహెచ్సాయితేజ(నిజామాబాద్),డి.భాస్కర్(ఖమ్మం), జి.సాయికృష ్ణ(నల్ల గొండ),బి.గోపి(ఖమ్మం), ఆర్.నిఖి, సాయితేజ(వరంగల్)లను ఎంపిక చేశారు.
బాలికల విభాగం : పి.సింధుప్రియ(కరీంనగర్), జె.శ్రీనిధి(వరంగల్), బి.కావేరి(నల్లగొండ), సిహెచ్.వాణి(కరీంనగర్) కె.స్వాతి(ఆదిలాబాద్), వి.అంకిత (వరంగల్), డి.శాంతికుమార్(ఆదిలాబాద్), ఎ.హారిక(కరీంనగర్), డి.వెంకటలక్ష్మి (వరంగల్), సిహెచ్.మేఘన(రంగారెడ్డి), బి.ఉమామహేశ్వరి(ఖమ్మం), చందన (నల్లగొండ), పి.దీపిక (నిజామాబాద్), సుస్మిత(నిజామాబాద్), ఎం.పూర్ణిమ (ఆదిలాబాద్), బి.రజిత(నల్లగొండ)లను ఎంపిక చేసినట్లు రాష్ట్ర బాల్బ్యాడ్మింటన్ రాష్ట్ర కార్యదర్శి రవీందర్ ప్రకటించారు.