Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కోల్కతా: బెంగాల్ పురుషుల క్రికెట్ జట్టు ప్రధానకోచ్గా వరుసగా నాల్గోసారి అరుణ్లాల్ కొనసాగనున్నారు. సోమవారం జరిగిన బెంగాల్ కోచింగ్ యూనిట్, క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్(క్యాబ్) అడ్మినిస్ట్రేషన్ సభ్యుల సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు క్యాబ్ అధ్యక్షులు అవిశేక్ ధాల్మిక తెలిపారు. అరుణ్లాల్ నేతృత్వంలోనే బెంగాల్ జట్టు 2006-07 తర్వాత రెండోసారి రంజీట్రోఫీ ఫైనల్లోకి ప్రవేశించగల్గింది. ఇక స్పిన్ బౌలింగ్ కోచ్గా ఉత్పాల్ ఛటర్జీ, పేస్ బౌలింగ్ కోచ్గా రణదేబ్ బోస్ కొనసాగనున్నారు. జయదీప్ ముఖర్జీ క్రికెట్ ఆపరేషన్స్ బాధ్యతలను మరోసారి మోయనున్నారని ఆయన తెలిపారు.