Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: టీమిండియా క్రికెటర్ల సాధనకు ఆగస్టు-సెప్టెంబర్ విండోపై భారత క్రికెట్ కంట్రోల్బోర్డు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఆటను తిరిగి ప్రారంభించేందుకు అన్ని రకాలుగా బోర్డు కృషి చేస్తోందని బిసిసిఐ అధికారి ఒకరు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన నిబంధనలను జాతీయ క్రికెట్ అకాడమీ(ఎన్సిఏ) పరిశీలిస్తుంది. సాధ్యాసాధ్యాలను పరిశీలించిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని, 100శాతం నమ్మకం వచ్చిన తర్వాత పలు వేదికలను పరిశీలించి ఒక వేదికను ఎంపిక చేస్తామని ఆయన అన్నారు. ప్రయాణ నిబంధనలు సడలించిన తర్వాత జూన్ నెలాఖరు వరకూ క్యాంపు జరిగే అవకాశం లేదన్నారు. అవకాశం ఉన్న ఆటగాళ్లు బయట రన్నింగ్, ఇతర ప్రాక్టీస్ చేసుకుంటున్నారని, ఫ్లాట్, అపార్ట్మెంట్లలో ఉండేవాళ్లకు ఆ అవకాశం లేదని, అందుకే అందరూ నెట్స్లో ప్రాక్టీస్ చేసేందుకు ఎదురుచూస్తున్నారని ఆయన తెలిపారు. శ్రేయస్ అయ్యర్, శుభ్మన్ గిల్ మైదానాల్లో ప్రాక్టీస్కు భయపడుతున్నారని, సుహృద్భావ వాతావరణంలోనే నెట్స్లో సాధనకు వస్తామని చెప్పారని అన్నారు.