Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-ఎన్ఐఎస్కు చేరుకున్న బాక్సర్లు
పటియాల : కరోనా వైరస్ మహమ్మారి, దేశవ్యాప్త లాక్డౌన్తో ఇండ్లకే పరిమితం అయిన భారత బాక్సర్లు మూడు నెలలుగా బాక్సింగ్ రింగ్కు దూరమయ్యారు. ప్రాక్టీస్ ఎప్పుడెప్పుడు మొదలుపెడదామా అని ఎదురుచూస్తున్న బాక్సర్ల నిరీక్షణకు తెరపడింది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్ (ఎన్ఐఎస్) పటియాలకు బాక్సర్లు చేరుకున్నారు. దీంతో మరో 7-10 రోజుల్లో బాక్సర్లు తొలి సెషన్ ప్రాక్టీస్కు హాజరయ్యే అవకాశం కనిపిస్తోంది. ఈ మేరకు బాక్సింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా హై పర్ఫార్మెన్స్ డైర్టెక్టర్ శాంటియగో నీవ తెలిపారు. ' బాక్సర్లు శుక్రవారం నుంచి ఎన్ఐఎస్కు వస్తున్నారు. రానున్న రోజుల్లో బాక్సర్ల బృందం ఇక్కడికి చేరుకోనుంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం బాక్సర్లు అందరూ ఏడు రోజుల పాటు ఐసోలేషన్లో ఉండనున్నారు. 13 మంది పురుష బాక్సర్లు, ముగ్గురు మహిళా బాక్సర్లు వస్తున్నారు. నిజానికి ఆరుగురు మహిళా బాక్సర్లు వస్తారని అనుకున్నా.. ఇప్పుడే ముగ్గురు రాబోతున్నారు. అమిత్ పంగాల్, వికాశ్ కృష్ణన్, ఆశీష్ కుమార్, సతీశ్ కుమార్లు ఎన్ఐఎస్కు చేరుకోనున్నారు' అని శాంటియగో తెలిపారు.