Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-జాతి వివక్షపై కార్లోస్ బ్రాత్వేట్
సౌతాంప్టన్ : ఓ వైపు కరోనా మహమ్మారి మానవాళిని కబళిస్తుంటే.. మరోవైపు జాతి వివక్ష, కుల వివక్ష మానవత్వాన్ని ప్రశ్నార్థకం చేస్తున్నాయి. అమెరికాలో నల్లజాతీయుడు జార్జ్ ఫ్లాయిడ్ మరణంతో పెల్లుబికిన జాతి వివక్ష వ్యతిరేక ఉద్యమం దావానంలో కొనసాగుతూనే ఉంది. క్రీడా రంగంలోనూ జాతి వివక్ష పలు రూపాల్లో కనిపిస్తూనే ఉందని పలువురు క్రీడాకారులు గళం వినిపిస్తున్నారు. సమాన హక్కులు, సమాన అవకాశాలు, మనుషులందరూ సమానమే అనే నినాదంతో జాతి వివక్ష వ్యతిరేక ఉద్యమం సాగుతోంది. జాతి వివక్ష వ్యతిరేక ఉద్యమానికి దిగ్గజ బాస్కెట్బాల్ క్రీడాకారుడు మైకల్ జోర్డాన్ సుమారు రూ.760 కోట్లు విరాళం అందించగా.. వెస్టిండీస్ క్రికెట్ జట్టు తమ మ్యాచ్ జెర్సీలపై 'బ్లాక్ లైవ్స్ మ్యాటర్' చిహ్నంతో బరిలోకి దిగనుంది. జాతి వివక్ష వ్యతిరేక ఉద్యమానికి సంఘీభావ సూచనగా ఇంగ్లాండ్ క్రికెట్ జట్టు సైతం రానున్న టెస్టు సిరీస్లో 'బ్లాక్ లైవ్స్ మ్యాటర్' చిహ్నంతో కూడిన జెర్సీలను ధరించనున్నట్టు ఈసీబీ ప్రకటించింది. ఇదిలా ఉండగా.. చిహ్నాలు ధరించటం, సానుకూల సంకేతాలు వెలువరించటం, మోకాలి కూర్చోని విజ్ఞప్తి చేయటం వంటివి జాతి వివక్షను ఎదుర్కొనేందుకు సరిపోవని.. కఠినమైన చట్టాలు తీసుకురావటంతోనే జాతి వివక్షను రూపమాపగలమని వెస్టిండీస్ స్టార్ ఆల్రౌండర్ కార్లోస్ బ్రాత్వేట్ అభిప్రాయపడ్డాడు. ' ఐసోలేషన్లో మోకాలి నిలబడం, ఐసోలేషన్లో బ్యాడ్జిలు ధరించటం సరిపోవు. నా వరకు ఇవి కేవలం మేకప్ మాత్రమే. కొన్ని మరకలు, ముడతలను కప్పిఉండచానికి పనికొస్తాయి. రావాల్సిన పెనుమార్పు.. కఠిన చట్టాలు తీసుకురావటం. జగమైక సమాజానికి రీ ప్రోగ్రామ్ చేయటం అవసరం' అని బ్రాత్వేట్ అన్నాడు.