Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-కరోనా కష్టకాలంలో కంపెనీల మనోగతం
న్యూఢిల్లీ : కరోనా వైరస్ కారణంగా అన్ని రంగాలు కుదేలవుతున్నాయి. కరోనా మహమ్మారికి ముందే మందగమనం దిశగా వేగంగా పరుగులు తీసిన ఆర్థిక వ్యవస్థ.. కరోనా సమయంలో సంక్షోభం ముంగిట నిలిచింది. అన్ని రంగాల్లో ఆర్థికంగా లెక్కలేనన్ని ఇబ్బందులు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఖర్చు తగ్గించుకోవటంపై కంపెనీలు దృష్టి సారిస్తున్నాయి. అందులో భాగంగా, తొలుత ప్రచార, ప్రకటనలపై వ్యయ నియంత్రణ పాటిస్తున్నాయి. విపణీలో తమ బ్రాండ్ విలువను దూకుడుగా దూసుకెళ్లేందుకు క్రికెట్, సినీ తారలతో భారీ ఒప్పందాలు చేసుకున్న కంపెనీలు ఇప్పుడు కొత్త ప్రతిపాదన చేస్తున్నాయి. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ బ్రాండ్స్ సెలబ్రిటీ కంపెన్సెషన్ నివేదికలో ప్రచారకర్తలు (బ్రాండ్ అంబాసిడర్లు) 20-30 శాతం కోత విధించుకోవాలని అభిప్రాయపడ్డాయి. కోవిడ్-19 కష్టకాలంలో ప్రచారకర్తలు కచ్చితంగా కోతకు సిద్ధపడాలని 64 శాతం కంపెనీలు అభిప్రాయం వ్యక్తం చేశాయి. విరాట్ కోహ్లి, ఎం.ఎస్ ధోని, రోహిత్ శర్మ, అక్షరు కుమార్, రణ్వీర్ సింగ్, దీపిక పదుకొణె, రణబీర్ కపూర్, ఆలియా భట్లు తమ ఒప్పందంలో కోతకు సిద్ధపడాలని కంపెనీలు కోరుతున్నాయి. కరోనా సమయంలోనూ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్లతో దండిగా సంపాదించిన విరాట్ కోహ్లి స్వచ్ఛందంగా కోతకు సిద్ధపడనున్నట్టు తెలుస్తోంది.