Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-ఐపీఎల్ ప్రకటనలకు స్పందన కష్టమే ొస్టార్ఇండియా చైర్మెన్ ఉదరుశంకర్
న్యూఢిల్లీ : సురక్షిత వాతావరణంలో మాత్రమే ఐపీఎల్ 2020 నిర్వహణకు అవకాశం ఉందని, కరోనా కోరల్లో ఐపీఎల్ నిర్వహణకు సుముఖంగా లేమని చెప్పిన లీగ్ ప్రసార భాగస్వామి స్టార్ఇండియా చైర్మన్ ఉదరు శంకర్.. తాజాగా మరో కీలక వ్యాఖ్య చేశాడు. ప్రతి సీజన్కు బీసీసీఐకి ప్రసార హక్కుల నిమిత్తం రూ.3249 కోట్లు చెలిస్తోన్న స్టార్ ఇండియా.. మార్కెట్ నుంచి అంతకు రెట్టింపు సొమ్మును రాబడుతోంది. ఈ సీజన్ అందుకు భిన్నంగా ఉండనుందని స్టార్ ఇండియా ముందుగానే గ్రహించింది!. స్టార్ ఇండియా, డిస్నీ ఇండియా చైర్మన్ ఉదరు శంకర్ వ్యాఖ్యలు దీన్ని బలపరుస్తున్నాయి. ' ప్రకటనదారులు డబ్బులు పెట్టేందుకు ఏదైనా అవకాశం ఉందంటే అది ఒక్క ఐపీఎల్ మాత్రమే. అది కూడా నిజంగా వారు ప్రకటనలను వెళ్లాలని భావిస్తేనే. మార్కెట్ భారీ షాక్లో కొనసాగుతోంది. రానున్న 6-8 వారాల్లో మార్కెట్ వేల కోట్లు వెచ్చించే స్థాయికి పుంజుకుంటుందో లేదో చెప్పలేం. ఐపీఎల్ ఎంతో ఖరీదైన టోర్నీ. ప్రసార హక్కుల కోసం మేము (స్టార్ఇండియా) భారీ మొత్తం వెచ్చించాం. ఇటీవల కాలంలో చవిచూసిన ఈ ఆర్థిక విపత్తుతో.. ఐపీఎల్కు మద్దతు పలికేందుకు మార్కెట్ సిద్ధంగా ఉందని అనుకోవటం లేదు' అని ఉదరు శంకర్ వ్యాఖ్యానించారు. ఈ ఏడాది ఐపీఎల్ ఎప్పుడు జరుగుతుందో మాకు తెలియదు. బీసీసీఐతో మేము జరిపిన ప్రతి చర్చలోనూ ఐపీఎల్ నిర్వహణకు వారు ఆసక్తిగా ఉన్నారని, అతి త్వరలోనే ప్రణాళిక చేస్తున్నారనే విషయం అర్థమవుతోంది. ఇప్పటికైతే మన దగ్గర వర్షాలు కురవటం మొదలయ్యాయి. మైదానాలు ఐపీఎల్కు ఏమాత్రం సహకరించవు. వర్షాకాలం ముగిసే సమయానికి కరోనా వైరస్ తీవ్రత తగ్గుతుందని ఆశిస్తున్నాం. బహుశా ఐపీఎల్పై చర్చలు అర్థవంతంగా ఉండగలవని ఉదరు శంకర్ అభిప్రాయపడ్డారు.