Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా
ముంబయి : స్టార్ ఆల్రౌండర్గా పాకిస్థాన్ క్రికెటర్ షాహిద్ ఆఫ్రిది విశేష అభిమానులను సంపాదించుకున్నా.. పొరుగుదేశం భారత్పై వివాదస్పద వ్యాఖ్యలతో తరచుగా గౌరవం కోల్పోతున్నాడు. భారత క్రికెటర్లపై మరోసారి అనుచిత వ్యాఖ్యలు చేసిన ఆఫ్రిదికి మాజీ క్రికెటర్, వ్యాఖ్యాత ఆకాశ్ చోప్రా తగిన బుద్ధి చెప్పాడు. 'భారత్తో ఆడటాన్ని ఎప్పుడూ ఆస్వాదించాను. భారత్ను ఎన్నోసార్లు అతి సులువుగా ఓడించాం. ఓటమి అనంతరం భారత క్రికెటర్లు మావద్దకు వచ్చి క్షమాపణలు కోరేవారు' అని ఆఫ్రిది యూట్యూబ్ షోలో వ్యాఖ్యానించాడు. ఆకాశ్ చోప్రా ఈ వ్యాఖ్యలపై మండిపడ్డాడు. ఆఫ్రిది ఒకలా చెప్పబోయి, మరోవిధంగా చెప్పాడేమో అని వ్యంగాస్త్రం సంధించాడు. ' పాకిస్థాన్ జట్టు నిజంగా చాలా మంచి జట్టు. అందులో రెండో అభిప్రాయం లేదు. ఇప్పుడూ పాకిస్థాన్కు మంచి జట్టే ఉంది. ఒకానొక సమయంలో పాక్ది భారత్ కంటే మెరుగైన జట్టు. కానీ ఆ సమయం ఆఫ్రిది కాలంలో కాదు. ప్రతిభావంతులైన ఇమ్రాన్ ఖాన్, వసీం అక్రమ్, వకార్ యూనిస్ల సమయంలో పాకిస్థాన్ గొప్ప జట్టు. భారత్, పాక్ ద్వైపాక్షిక గణాంకాలు చూసినా ఇది అర్థమవుతుంది. 15 టెస్టుల్లో చెరో ఐదు టెస్టులు నెగ్గారు. వన్డేల్లో 41-39తో (82 వన్డేలు)పాకిస్థాన్ ముందంజలో ఉంది. రెండు మ్యాచులు ఎక్కువగా గెలిచినందుకు క్షమాపణలు ఎవరైనా క్షమాపణలు కోరతారని నేను అనుకోను. ఇక టీ20ల్లో భారత్ 7-1తో తిరుగులేని ముందంజలో ఉంది. ఆఫ్రిది చెప్పిన కథకు బలం లేదు. బహుశా అతడు మరో విధంగా చెప్పదలుచుకుని, ఇలా చెప్పాడేమో. ఆఫ్రిది వ్యాఖ్యలతో ఎంతో ఆశ్చర్యానికి లోనయ్యాను' అని ఆకాశ్ చోప్రా చురకంటించాడు.