Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రకటించిన గంగూలీ
న్యూఢిల్లీ : 2020 ఆసియాకప్పై బీసీసీఐ అధ్యక్షుడు, టీమ్ఇండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ కీలక ప్రకటన చేశాడు. 2020 ఆసియాకప్ ఆతిథ్య హక్కులు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) కలిగి ఉంది. యు.ఏ.ఈ లేదా శ్రీలంక వేదికలుగా ఆసియాకప్ నిర్వహణకు పీసీబీ ఏర్పాట్లు చేస్తోన్న సంగతి తెలిసిందే. బుధవారం ఇన్స్టాగ్రామ్ లైవ్ సెషన్లో మాట్లాడుతూ దాదా కీలక వ్యాఖ్యలు చేశాడు. ' సెప్టెంబర్లో ఆసియా కప్ జరగాల్సి ఉంది. కానీ ఇప్పుడు ఆసియాకప్ రద్దు అయ్యింది' అని దాదా ప్రకటించాడు. గంగూలీ వ్యాఖ్యలపై పాకిస్థాన్ క్రికెట్ స్పందించలేదు. అక్టోబర్-నవంబర్లో జరగాల్సిన టీ20 వరల్డ్కప్ సైతం వాయిదా పడే వకాశం కనిపిస్తోంది. దీంతో సెప్టెంబర్-నవంబర్ సమయంలో ఐపీఎల్ నిర్వహణకు బీసీసీఐకి మార్గం సుగమం అవుతోంది.