Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-ప్రకటించిన ఆసియా క్రికెట్ కౌన్సిల్
న్యూఢిల్లీ : ఆసియాకప్పై అధికారిక ప్రకటన వెలువడింది. ఇక టీ20 వరల్డ్కప్పై ఐసీసీ ప్రకటనే మిగిలింది. ఆసియా కప్ 2020 రద్దు అయినట్టు బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ వెల్లడించిన, తర్వాతి రోజే ఏసీసీ అధికారిక ప్రకటన చేసింది. ' షెడ్యూల్ ప్రకారం ఆసియా కప్ నిర్వహణకు ఏసీసీ ఆసక్తిగా ఉంది. కానీ ప్రయాణ ఆంక్షలు, దేశాల వారీ క్వారంటైన్ నిబంధనలు ఆసియా కప్ నిర్వహణకు సవాళ్లు విసిరాయి. వీటికి తోడు టోర్నీలో పాల్గొనే క్రికెటర్లు, సహాయక సిబ్బంది, కమర్షియల్ భాగస్వాముల ఆరోగ్యం, భద్రత ప్రధానం. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని 2020 ఆసియా కప్ను వాయిదా వేస్తున్నాం' అని ఏసీసీ ప్రకటనలో తెలిపింది. 2021 జూన్లో నిర్వహణకు నూతన షెడ్యూల్ రూపొందిస్తామని పేర్కొంది. ఆసియాకప్లో డిఫెండింగ్ చాంపియన్ భారత్, పాకిస్థాన్, శ్రీలంక, బంగ్లాదేశ్ సహా ఆరు దేశాలు పాల్గొంటాయి.