Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-రూ.100 కోట్లు ఇవ్వనున్న వింబుల్డన్
లండన్ : మహమ్మారి ముప్పుతొ రద్దుగా ముగిసిన 2020 వింబుల్డన్ గ్రాండ్స్లామ్.. ఆటగాళ్లకు ఆర్థిక చేయూత ఇవ్వనుంది. ఈ మేరకు ఆల్ఇంగ్లాండ్ లాన్టెన్నిస్ క్లబ్ (ఏఈఎల్టీసీ) శుక్రవారం ప్రకటించింది. జూన్ 29-జులై 12న జరగాల్సిన ప్రతిష్టాత్మక వింబుల్డన్ గ్రాండ్స్లామ్ కరోనా వైరస్ కారణంగా రద్దు అయిన సంగతి తెలిసిందే. ప్రతి ఏడాది రూ.23 కోట్లతో మహమ్మారి బీమా చేసిన వింబుల్డన్ నిర్వాహకులు బీమా కింద రూ.1520 కోట్ల అందుకోనున్నారు. దీంతో ఈ ఏడాది వింబుల్డన్ టోర్నీ జరుగపోయినా.. ర్యాంకింగ్ ప్రకారం వింబుల్డన్ను అర్హత సాధించిన 620 మంది క్రీడాకారులకు రూ.100 కోట్ల నగదు బహుమానం ఇవ్వనుంది. 224 మంది సింగిల్స్ క్రీడాకారులకు రూ.10.75 లక్షలు, 256 మంది క్రీడాకారులకు రూ.21.5లక్షలు, డబుల్స్ క్రీడాకారులకు రూ.5.37 లక్షలు, వీల్చైర్ క్రీడాకారులకు రూ.5.16 లక్షలు చొప్పున అందించనున్నారు.