Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-రూల్స్ అతిక్రమించిన బాక్సర్లపై చర్యలు?
పటియాల : భారత క్రీడా ప్రాధికార సంస్థ (సారు) శనివారం విచారణ కమిటీ ఏర్పాటు చేసింది. పటియాల నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్ (ఎన్ఐఎస్)లో ముగ్గురు బాక్సర్లు కోవిడ్-19 క్వారంటైన్ నిబంధనలు ఉల్లంఘించటం సారు వర్గాల్లో కలకలం రేపింది. టోక్యో ఒలింపిక్స్కు అర్హత సాధించిన స్టార్ బాక్సర్లు వికాశ్ కృషణ, నీరజ్ గోయత్, సతీశ్ కుమార్లు ఇటీవల సారు సెంటర్కు చేరుకున్నారు. కోవిడ్-19 నిర్ధారణ పరీక్షలు అనంతరం ఐసోలేషన్లో ఉంచారు. అయినా, ఈ ముగ్గురు బాక్సర్లు ఇతర క్రీడాకారులతో కనిపించటం వివాదానికి కారణమైంది. ప్రభుత్వ మార్గదర్శకాలు పాటిస్తూ, బాక్సింగ్ శిక్షణ శిబిరం నిర్వహిస్తామని బాక్సింగ్ ఫెడరేషన్ అనుమతులు తీసుకుంది. ఇప్పుడు ఈ సంఘటనతో సారు విచారణ కమిటీ ఏర్పాటు చేసింది. సారు కార్యదర్శి రోహిత్ భరద్వాజ్, టాప్ సీఈఓ రాజేశ్ రాజగోపాలన్, మాజీ హాకీ కోచ్ ఎకె భన్సాల్, సారు డిప్యూటీ డైరెక్టర్ దండపాణి కమిటీలో ఉన్నారు.