Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తెలంగాణలో పెరిగిన టెస్టులు... అదే స్థాయిలో పాజిటివ్ కేసులు
ొ మూడు జిల్లాల్లో వెయ్యి కేసులు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో కరోనా టెస్టుల సంఖ్య పెంచారు. గత కొన్ని రోజులు ప్రతి రోజూ 15 వేల నుంచి 16 వేల వరకు నమూనాలను పరీక్షిస్తుండగా తాజాగా 21,380 మందికి ఒకేరోజు టెస్టులు చేశారు. దీంతో 1986 మందికి పాజిటివ్ ఉన్నట్టు గుర్తించారు. బుధవారం రాత్రి 8 గంటల నుంచి గురువారం రాత్రి 8 గంటల వరకు 24 గంటల వ్యవధిలో ఇవి నమోదైనట్టు వైద్యారోగ్యశాఖ తాజా బులెటిన్ లో పేర్కొంది. ఇంకా 1216 మంది రిపోర్టులు రావాల్సి ఉన్నది. రాష్ట్రంలో ఇప్పటి వరకు 62,703 పాజిటివ్ కేసులు రాగా ఇందులో 45,388 మంది కోలుకున్నారు. 519 మంది మరణించగా 16,796 మంది చికిత్స పొందుతున్నారు.హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో 50 శాతం పైగా కేసులు నమోదయ్యాయి. మూడు జిల్లాల్లో కలిపి 998 ఉన్నాయి. వీటిలో అత్యధికంగా తాజాగా నమోదయిన కేసుల్లో జీహెచ్ఎంసీ పరిధిలో 586 ఉండగా మేడ్చల్ మల్కాజ్గిరిలో 207, రంగారెడ్డిలో 205 ఉన్నాయి. ఇక మిగిలిన జిల్లాల్లో 988 నమోదు కాగా వరంగల్ అర్బన్ 123, కరీంనగర్ లో 116, సంగారెడ్డిలో 108 ఉన్నాయి.