Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఈఎస్ఐ ఔట్సోర్సింగ్ ఉద్యోగుల వేతనాలపై హైకోర్టు నిలదీత
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఈఎస్ఐలో ఔట్సోర్సింగ్ సిబ్బందికి 16 నెలలుగా జీతాలు ఎందుకు చెల్లించడం లేదో చెప్పాలని రాష్ట్ర సర్కార్ను హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నవీన్రావు శుక్రవారం ఆదేశించారు. ఈఎస్ఐలో స్కాం జరిగిందని చెప్పి తమ జీతాల్ని ఇవ్వడం ఆపేశారంటూ దినేష్చంద్ర మరో 18 మంది వేసిన రిట్పై లాయర్ శ్రీనివాస్ వాదించారు. ఈఎస్ఐ మందుల కొనుగోళ్ల పేరుతో రూ. 1000 కోట్ల ఈఎస్ఐ కుంభకోణంలో ఈఎస్ఐ సూపరింటెండ్పైనే ఆరోపణలున్నాయనీ, ఈ స్కాంకు సంబంధం లేని ఔట్సోర్సింగ్ ఉద్యోగుల జీతాల చెల్లింపులు ఆపేయడం అన్యాయమని న్యాయంస్థానం దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన హైకోర్టు.. జీతాలు ఆపడంపైనే వాదనలు చేయాలనీ, స్కాంలో అంశాలపై ఎందుకు చెబుతున్నారని తప్పుపట్టింది. ప్రభుత్వ కౌంటర్ కోసం విచారణను ఈ నెల ఐదో తేదీకి వాయిదా వేసింది.
కరోనా నిబంధనల ఉల్లంఘనపై కేసులు
కరోనా నిబంధనలు ఉల్లంఘిస్తున్న వారిపై కేసులు నమోదు చేస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు నివేదికను శుక్రవారం అందజేసింది. కరోనాపై దాఖలైన పలు ప్రజాప్రయోజనాలపై ప్రభుత్వం తరఫున ఐఏఎస్ అధికారి దివ్య కౌంటర్ పిటిషన్ దాఖలు చేశారు. పెండ్లికి 50 మంది, అంత్యక్రియలకు 20 మందికి మించకుండా ఉండాలన్న జీవో 75ను కచ్చితంగా అమలు చేస్తున్నామని తెలిపారు. ఆయా కేసుల్లో 101 మంది, 27 మందిపై పోలీసులు కేసులు పెట్టామని హైకోర్టుకు నివేదించారు. కరోనాకు చెందిన ఫిర్యాదుల కోసం హైల్ప్లైన్లతో పాటు 104 ఫోన్ నెంబర్ ఏర్పాటు చేశారు. మార్చి 23న 33 కరోనా కేసులుంటే జూన్ 29 నాటికి 15,394కు చేరిందనీ, 446 రెట్లు పెరిగాయని తెలిపారు. దేశంలో 497 కేసుల నుంచి 5,67,536 కేసులయ్యాయని వివరించారు. మాస్క్ పెట్టుకోలేదని 35,308, భౌతిక దూరం పాటించలేదని 1211, పబ్లిక్ మీటింగ్లు ఉల్లంఘించారని 82 కేసులు పెట్టామని చెప్పారు. జూలై 25 నాటికి 2,64,852 టెస్టులను రాష్ట్ర ప్రభుత్వం చేసిందన్నారు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ 10 లక్షల మందికి 140 టెస్ట్లు చేయాలని చెబితే రాష్ట్రంలో 391 టెస్ట్లు చేశామని వివరించారు. 57 ప్రభుత్వ, 54 ప్రయివేటు ఆస్పత్రుల్లో కరోనాకు వైద్య సేవలు అందుతున్నాయని తెలిపారు. పీహెచ్సీ, సీహెచ్సీ సెంటర్స్లోనూ కరోనా టెస్ట్లు చేస్తున్నామని వివరించారు.