Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-సర్కారు ఉత్తర్వులు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
మద్యం షాపుల వేళలను మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. మద్యంషాపులు తెరిచి ఉంచే వేళల్లో మార్పులు చేసింది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఇప్పటి వరకు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 8 గంటల వరకు మాత్రమే మద్యాన్ని విక్రయించాలనే నిబంధనను అమలు చేశారు. తాజాగా అన్లాక్ ప్రక్రియలో భాగంగా వైన్ షాపులపై ఉన్న ఆంక్షలను పూర్తిగా ఎత్తి వేశారు. లాక్డౌన్ విధింపునకు ముందుగా ఉన్న సమయమే ఇప్పుడూ కొనసాగుతుందని ప్రకటిం చారు. ఈ మేరకు రాష్ట్ర ఎక్సైజ్ శాఖ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ సోమవారం సర్క్యులర్ జారీ చేశారు. గతంలో ఉదయం 10గంటల నుంచి రాత్రి 11గంటల వరకు మద్యం షాపులు తెరిచి ఉంచేవారు. తాజాగా ఉత్తర్వులతో గతంలో మా దిరిగానే మద్యం షాపులు తెరుచుకోనున్నాయి.