Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎంజీఎంలో ప్రయివేటు ల్యాబ్ టెక్నీషియన్ల నిరసన
నవతెలంగాణ-మట్టెవాడ
కోవిడ్-19 విభాగంలో కరోనా లక్షణాలతో వచ్చే రోగులకు సేవలందిస్తున్న తమకు ఎలాంటి రక్షణ పరికరాలూ ఇవ్వట్లేదని, తమ పట్ల అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఎంజీఎం ప్రయివేటు ల్యాబ్ టెక్నీషియన్లు ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం వరంగల్ ఎంజీఎంలో వారు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఎంజీఎం ప్రయివేటు ల్యాబ్ టెక్నీషియన్ అసోసియేషన్ మెంబర్ సతీష్ మాట్లాడుతూ.. ప్రాణాల్ని పణంగా పెట్టి కోవిడ్-19వార్డులో సేవలందిస్తున్నామన్నారు. మొత్తం 27మంది ప్రయివేటు ల్యాబ్ టెక్నీషియన్లు ఉన్నారని, వారి పట్ల అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. కనీసం గ్లౌజులు కూడా లేవని వాపోయారు. కోవిడ్-19 విభాగం నుంచే ల్యాబ్కు వెళ్లే దారి ఉందని, కరోనా బాధితుల మధ్య నుంచే ఎలాంటి రక్షణ లేకుండా వెళ్లాల్సి వస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. ల్యాబ్లో కనీసం బాత్రూం కూడా లేదన్నారు. ఉదయం 12 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు గొడ్డు చాకిరీ చేస్తున్నా అధికారులు పట్టించుకోవట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ల్యాబ్ టెక్నీషియన్స్ పట్ల నోడల్ అధికారి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్నారు. 12 గంటలు చేయాల్సిందేనంటూ హుకుం జారీ చేశారని చెప్పారు. రక్షణ పరికరాలు లేకుండా తాము ఎలా విధులు నిర్వర్తించాలని ప్రశ్నించారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు.