Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నియంత్రణకు సర్కారు చర్యలు తీసుకునేలా చూడండి : గవర్నర్కు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఫిర్యాదు
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలో దళితులపై దాడులు ఆగడం లేదని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆవేదన వ్యక్తం చేశారు. దాడుల నియంత్రణకు సర్కారు చర్యలు తీసుకునేలా చూడాలని గవర్నర్కు ఫిర్యాదు చేశారు. ఈమేరకు మంగళవారం గవర్నర్కు మొయిల్ద్వారా ఫిర్యాదు చేశారు. అనంతరం అసెంబ్లీ మీడియాపాయింట్లో ఆయన విలేకర్లతో మాట్లాడారు. దళితులపై జరుగుతున్న దాడులపై డీజీపీకి ఫిర్యాదు చేసినప్పటికీ కనీసం స్పందన లేదన్నారు. దళితులపై జరుగుతున్న దాడులు గురించి గవర్నర్కి ఫిర్యాదు చేస్తామన్నారు. గజ్వేల్లో ప్రభుత్వం చేసిన తప్పు వల్లే రైతు ఆత్మహత్య చేసుకున్నారనీ, రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే రాష్ట్రంలో కరోనా వైరస్ విజంభిస్తున్నదన్నారు. పట్టణాల నుంచి గ్రామాలకు కరోనా వైరస్ వ్యాప్తి జరిగిందనీ, ప్రజారోగ్యాన్ని సర్కారు గాలికివదిలేసిందన్నారు. గ్రామాలు, మండల కేంద్రాల్లో క్వారంటైన్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్లో ప్రతిరోజు 11 టీఎంసీలు శ్రీశైలం బ్యాక్ వాటర్ లిఫ్ట్ చేయడానికి జీవో విడుదల చేస్తే కేసీఆర్ నుంచి ఎలాంటి స్పందన లేదన్నారు. 19వ తేదీలోపు ఏపీ సర్కారు చేపట్టే టెండర్ల ప్రక్రియను ప్రభుత్వం అడ్డుకోవాలని డిమాండ్ చేశారు.