Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వికారాబాద్ జిల్లా పరిగిలో ఘటన
నవతెలంగాణ-పరిగిరూరల్
పంటల దిగుబడి రాక.. సాగు కోసం తెచ్చిన అప్పు ఎలా తీర్చాలని మనోవేదనకు గురైన రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన వికారాబాద్ జిల్లా పరిగి మండలంలో మంగళవారం జరిగింది. కుటుంబసభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నర్సయ్యగూడకు చెందిన ఆనందం(40)కు, ఎకరా 10 గుంటల భూమి ఉంది. గతేడాది పత్తి సాగుచేశాడు. మొత్తం సాగు కోసం తెచ్చిన అప్పులు రూ.2లక్షలు ఉంది. వడ్డీతో కలిపి అప్పు పెరుగుతోంది. వాటిని తీర్చే దారిలేకపోయింది. ఈ క్రమంలో సోమవారం ఉదయం పొలం వద్ద పురుగుల ముందు తాగాడు. కుటుంబసభ్యులు చికిత్స నిమిత్తం వికారాబాద్లోని ఆస్పత్రి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్కు తీసుకుపోతుండగా మార్గమధ్యలో మంగళవారం సాయంత్రం మృతిచెందాడు. రైతుకు భార్య, కుమారుడు, కూతురు ఉంది. మృతుడి సోదరుడు యాదయ్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ శ్రీశైలం తెలిపారు.