Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి
రాష్ట్ర మహిళా భద్రతా విభాగం అదనపు డీజీ స్వాతిలక్రాకు కరోనా పాజిటివ్గా తేలింది. ఆమె విధి నిర్వహణలో భాగంగా ఇటీవల పలు కార్యక్రమాలకు ఆమె హాజరవుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఆమెకు వైరస్ సోకినట్టుగా డీజీపీ కార్యాలయ వర్గాలు తెలిపాయి. ఇప్పటికే ఇదే కార్యాలయానికి చెందిన మరి కొందరు అధికారులకు కరోనా రాగా, వారు హౌంక్వారంటైన్లో ఉండి తిరిగి ఆరోగ్యంతో విధులకు హాజరవుతున్నారు. తాను బాగానే ఉన్నానని, అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నానని, త్వరలోనే విధులకు హాజరవుతానని అదనపు డీజీ స్వాతి లక్రా నవతెలంగాణతో మంగళవారం ఫోన్లో మాట్లాడారు.