Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-ఏసీబీకి సర్కార్ గ్రీన్ సిగల్
నవ తెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి
ఈఎస్ఐ ఐఎంఎస్లో వందల కోట్ల రూపాయల మందుల కొనుగోల్ కుంభకోణంలో నిందితుడైన ప్రయివేటు ఫార్మా కంపెనీ ఎండీ బాబ్జీ ఆస్తుల జప్తునకు ఏసీబీ అధికారులు సిద్ధమయ్యారు. బాబ్జీకి చెందిన రూ. 162 కోట్ల రూపాయల ఆస్తులను జప్తు చేయడానికి ఏసీబీ అధికారులు నిర్ణయించారు. ముఖ్యంగా ఐఎంఎస్ డైరెక్టర్ దేవితో కుమ్మక్కైన బాబ్జీ తనకు చెందిన ఒమిని ఫార్యా ద్వారా మందులు సరఫరా చేసినట్టు చూపించి కోట్లాది రూపాయల గోల్మాల్కు పాల్పడినట్టు గతంలో ఏసీబీ అధికారులు తమ దర్యాప్తులో తేల్చారు. ఆస్తుల జప్తునకు ఏసీబీ అనుమతి కోరడంతో అందుకు తగిన న్యాయపరమైన చర్యలకు ప్రభుత్వం అనుమతి ఇచ్చినట్టు తెలిసింది.