Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
హీరాగోల్డ్ కంపెనీ రెండు లక్షల మందిని మోసం చేసి 5600 కోట్లను వసూలు చేసి తమ ఇష్టానుసారంగా నిధుల్ని మళ్ల్లీంచిందని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) హైకోర్టుకు తెలిపింది. ఆ కంపెనీ నుంచి రూ 150 వరకూ పొందిన సయ్యద్ అఫ్సర్, సయ్యద్ అక్తర్, సయ్యద్ కైసర్లు సాక్షులుగా రావాలంటే బెయిల్ కావాలని హైకోర్టుకు రావడంపై ఈడీ ఆక్షేపించింది. రూ 70.57 కోట్ల లావాదేవీలకు డాక్యుమెంట్లు చూపిన ఆ ముగ్గురూ మిగిలిన మొత్తానికి లెక్క చెప్పడం లేదని చెప్పింది. హీరాగోల్డ్పై దేశంలో 30కి ఎఫ్ఐఆర్ నమోదు అయ్యాయి. రూ299 కోట్ల ఆస్తుల్ని జప్తు చేశాం. నిధుల మళ్లింపు వ్యవహారంపై దర్యాప్తు చేయాల్సివుంది. వీరికి బెయిల్ ఇవ్వొద్దని జస్టిస్ జి శ్రీదేవి ఎదుట ఈడీ కోరింది. ముగ్గురూ ఈడీ ఎదుట హాజరు కావాలనీ, అయితే వారి విషయంలో ఈడీ కఠిన వైఖరితో ఉండకూడదని ఉత్తర్వులిచ్చిన హైకోర్టు ముగ్గురి బెయిల్ పిటిషన్లపై విచారణ ముగిసినట్టుగా ప్రకటించింది.