Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
చెరువులో చేపల వేలం విషయంలో అధికారిక రికార్డుల్లో మార్చేసిన నిర్మల్ జిల్లా లాండాపూర్ గ్రామ పంచాయతీ కార్యదర్శికి హైకోర్టు రూ 50వేల జరిమానా విధించింది. అంతేకాకుండా కార్యదర్శిపై శాఖపరంగా విచారణ చేపట్టి చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని ఆజిల్లా కలెక్టర్ను జస్టిస్ వినోద్కుమార్ మంగళవారం ఆదేశించారు. ఆ గ్రామంలోని కుమ్మరికుంట తాల్వెదా చెరువుల్లో చేపల్ని పట్టుకోడానికి అనుమతి ఇచ్చేలా ఉత్తర్వులు ఇవ్వాలని కోరుతూ తాల్వెదా ఫిషర్మెన్ కోఆపరేటివ్ సొసైటీ రిట్ దాఖలు చేసింది. చేపల వేలం జరిగిపోయిందని ప్రభుత్వం చెప్పింది. సమాచార హక్కు చట్టం కింద చెరువులోని చేపల్ని మత్స్య పారిశ్రామిక సంఘం పేరుతో రూ 5వేలకు ఇచ్చిన విషయాన్ని పిటిషనర్ లాయర్ హైకోర్టుకు తెలియజేశారు. దీంతో రికార్డుల్ని పరిశీలించిన హైకోర్టు గ్రామ కార్యదర్శి రికార్డుల్ని మార్చినట్టుగా గుర్తించి పైవిధంగా ఆదేశించింది.