Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : భద్రాచలంలోని ఐటిసి యొక్క పేపర్ బోర్డ్స్ అండ్ స్పెషాలిటీ పేపర్స్ బిజినెస్ (పిఎస్పిడి) యూనిట్కు కాన్ఫిడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండిస్టీ (సిఐఐ) గ్రీన్కో ప్లాటినమ్ం రేటింగ్ను ఇచ్చినట్లు ఐటిసి ఓ ప్రకటనలో తెలిపింది. పల్ప్ అండ్ పేపర్ రంగంలో ఈ గుర్తింపు పొందిన ఒకే ఒక్క సంస్థ తమదేనని పేర్కొంది. అదే విధంగా దేశంలో ఈ రేటింగ్ పొందిన రెండవ కంపెనీ అని వెల్లడించింది. పర్యావరణ పరిరక్షణ కోసం నాయకత్వ లక్షణాలను ప్రదర్శిస్తూనే, పూర్తి నిబద్ధత ప్రదర్శించే కంపెనీలకు ఈ గుర్తింపును ఇస్తారని తెలిపింది. ఐటిసి సంస్థ గత 15 సంవత్సరాలుగా కార్బన్ పాజిటివ్గా నిలువడంతో పాటుగా 18 సంవత్సరాలుగా వాటర్ పాజిటివ్, ఘన వ్యర్థాల రీసైక్లింగ్ పాజిటివ్గా 13 సంవత్సరాలుగా గుర్తింపు పొందిందని పేర్కొంది. సంస్థల యొక్క 10 విస్తత శ్రేణి గ్రీన్ పారామీటర్ల ఆధారంగా ఈ గుర్తింపును అందిస్తారని తెలిపింది.